TS News: తెలంగాణలో 3 రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని పేర్కొంది. ఇదే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్ ఎడతెరిపిలేని వర్షం..
మరోవైపు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటు వదిలి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. బోథ్ కండ్రే వాగు, నక్కలవాడ, కోట వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భోజనానికి ముందూ, తర్వాత టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
భోజనం తీసుకునే గంట ముందు, తర్వాత గంట వరకు టీ, కాఫీలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటిని వీలైనంత మితంగా తీసుకోవడమే మేలని సూచించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రాణాలు కన్నా.. ఆదాయమే మిన్నా?
గాలివాన దుమారంతో సోమవారం ముంబయిలోని అనేక హోర్డింగులు, బోర్డులు, ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాలు గాలికి కొట్టుకుపోయాయి. పాత ముంబయిలోని గొటక్పర్ ప్రాంతంలో 100 అడుగుల అక్రమ హోర్డింగు అక్కడున్న పెట్రోలు బంకుపై కుప్పకూలింది. -
దొంగ ఆలోచనలకు రెక్కలు
ఒకే ఒక్కడు.. 110 రోజులు.. దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణం.. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేసే ఇతను ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా..? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
స్మార్ట్గా చదివెయ్
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో.. విద్యాశాఖ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ఆకర్షణీయమైన తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!