Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పూర్తి కథనం
2. హైదరాబాద్లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. పూర్తి కథనం
3. పిన్నెల్లికి సుప్రీం షాక్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు తెదేపా పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపిందిపూర్తి కథనం
4,. ఎగ్జిట్ పోల్స్ జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అంతా ఊహించినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టింది. నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సూచీల్లో జోష్ నింపాయి.పూర్తి కథనం
5. తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు (Telangana Polycet Results) విడుదలయ్యాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు.పూర్తి కథనం
6. కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు
బైక్పై వచ్చి సెల్ఫోన్ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్లోని వెంగళరావునగర్ పరిధి లక్కీ హాస్టల్లో నివాసం ఉంటున్న పి.జాషువా కుమార్ ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హాస్టల్ బయట కూర్చున్నాడు. పూర్తి కథనం
7. ‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్ పరోక్ష హెచ్చరిక!
తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు.పూర్తి కథనం
8. గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!
దక్షిణ పోర్చుగల్లో జరుగుతున్న ఎయిర్షోలో (Portugal Air Show) ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్ మృతిచెందగా.. మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి కథనం
9. రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్, 3.3TB డేటాతో ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు
భారతీ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ (Airtel Xstream Fiber) క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందుకోసం కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. స్థానిక కేబుల్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. తద్వారా బ్రాడ్బ్యాండ్ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసింది.పూర్తి కథనం
10. న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
టీ20 ప్రపంచ కప్లో (T20 World Cup 2024) భారత్ లీగ్ స్టేజ్లో మూడు మ్యాచ్లను న్యూయార్క్లోని నాసౌవ్ కౌంటీ స్టేడియం వేదికగా.. మరో మ్యాచ్ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ కూడా నాసౌవ్లోనే జరిగింది. ఇందులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..