Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. తెలంగాణపై ప్రభావం చూపవు: కేటీఆర్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘‘ ‘ది కేరళ స్టోరీ’.. కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో పూర్తిగా విఫలమైంది. అదే మాదిరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోయేది లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. 36 వేలమంది టీచర్ల తొలగింపు!
ఉపాధ్యాయుల నియామకాల్లో కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో గతంలో నియమితులైన 36 వేల మంది ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నియామక ప్రక్రియలో విధివిధానాలను పాటించలేదని పేర్కొంటూ వీరి నియామకాలను రద్దు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అట్లుంటది.. మా సూర్యతోని: రోహిత్ శర్మ ప్రశంసలు
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్లో గుజరాత్ టైటాన్స్పై ముంబయి ఇండియన్స్ (MI vs GT) ప్రతీకార విజయం సాధించింది. ముంబయి బ్యాటర్ సూర్యకుమార్ (103*) శతకంతో విజృంభించడంతో ముంబయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, రషీద్ ఖాన్ (79*) కాస్త హడలెత్తించినా చివరికి గెలుపు ముంబయిదే అయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సిద్ధా.. శివ.. ముఖ్యమంత్రి ఎవరు..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress)కు ఓటర్లు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. 2004 నుంచి ఆ పార్టీకి స్థాయి మెజార్టీ రావడం రెండోసారి. ఈ సారి ముఖ్యమంత్రి స్థానానికి పార్టీకి చెందిన దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. కర్ణాటకలో కమలం వాడిపోవడానికి కారణాలెన్నో..!
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా చతికిలపడింది. గతంలో సాధించిన సీట్లలో దాదాపు 40కిపైగా ఈ సారి కోల్పోయింది. కేవలం కొన్ని సామాజిక వర్గాలపై ఆధారపడటం.. అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం.. రిజర్వేషన్ల తేనెతుట్టెను ఎన్నికలకు ముందు కదపడం వంటివి కమలం విజయావకాశాలను దెబ్బతీశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. సోనియాకు మాటిచ్చినట్టే..: ఉద్వేగానికి గురైన డీకే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) ఫలితాల్లో కాంగ్రెస్ గెలుపు ఖరారైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఫలించని బ్రహ్మానందం ప్రచారం.. హీరో నిఖిల్కు మరో ఫ్లాప్.. గాలి కుటుంబానికి నిరాశ
కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు అభ్యర్థుల తరపున సినీ నటులు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఎన్నికల ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి, మంత్రి డాక్టర్ కె.సుధాకర్కు ఓటు వేసి గెలిపించాలని తెలుగులో విన్నవించారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సుధాకర్ ఓటమి పాలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కన్నడనాట.. ‘హస్త’వాసిని మార్చిన ‘పంచ’తంత్రం
వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అంచు వరకు వెళ్లిన హస్తం పార్టీ.. తిరిగి బలంగా పుంజుకుంది. ఏడాది ఆరంభంలో హిమాచల్ప్రదేశ్ ఇచ్చిన విజయోత్సాహం.. కాంగ్రెస్ నేతల్లో బూస్ట్ నింపింది. అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటక (Karnataka)ను చేజిక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ‘మా నాన్న సీఎం కావాలి’..యతీంద్ర సిద్ధరామయ్య
కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) తనయుడు యతీంద్ర సిద్ధరామయ్య ( Yathindra Siddaramaiah) కాంగ్రెస్(Congress) విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగ్గట్టుగా తన తండ్రి పూర్తి మెజార్టీ సాధిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఆ సెంచరీ సాధించాక.. అలా అనుకున్నా: విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్లో దాదాపు మూడేళ్లపాటు ఒక్క సెంచరీ లేకుండా మ్యాచ్లను ఆడాడు. అర్ధశతకాలు సాధించినా.. వాటిని శతకాలుగా మార్చడంలో మాత్రం విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో దాదాపు నెల రోజులపాటు క్రికెట్కు విరామం ఇచ్చి మరీ మైదానంలోకి దిగాడు. గతేడాది టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో అఫ్గానిస్థాన్పై సెంచరీ సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్