Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే..!
మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే.. కేంద్రమంత్రులకు శాఖలు కేటాయించింది. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ (సహాయ), భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ), జి.కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. బండి సంజయ్ కుమార్ హోంశాఖ (సహాయ) మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. మోదీ క్యాబినెట్ తొలి భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. సోమవారం సాయంత్రం తన మంత్రివర్గంతో సమావేశమయ్యారు. 7, లోక్ కల్యాణ్ మార్గ్లోని మోదీ నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. క్యాబినెట్ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు.. చంద్రబాబు నివాసానికి ఆశావహుల క్యూ!
మంత్రివర్గ కూర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు తన నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశావహులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. తమ అధినేతను కలిసి ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, కూటమి ఎమ్మెల్యేలంతా మంగళవారం చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ‘ఒక్కో టీచర్ బదిలీకి ₹3 నుంచి 6 లక్షలు వసూలు’.. బొత్సపై ఏసీబీకి వర్ల ఫిర్యాదు
వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా నేత వర్ల రామయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరపాలని అధికారులను కోరారు. బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రాజకీయాలకు గుడ్బై చెప్పిన కేశినేని నాని
సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ పంచన చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి జగన్ సర్కార్ బాధితులకు ఆహ్వానం
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వైకాపా ప్రభుత్వం చేతిలో నానా రకాలుగా వేధింపులకు గురైన బాధితులను సైతం కొత్త ప్రభుత్వం ఆహ్వానించింది. ఆహ్వానం అందినవారిలో అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 104 కుటుంబాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ‘ఈ-పోస్ట్’తో మీ ప్రియతమ నేతకు విషెస్ చెప్పొచ్చు!
సార్వత్రిక ఎన్నికల విజేతల్ని అభినందించేందుకు ఈ-పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపేలా ఏపీ తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.10తో ఈ-పోస్ట్ ద్వారా శుభాకాంక్షల్ని ఏ పోస్టాఫీసు నుంచైనా పంపించవచ్చని విశాఖ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. ప్రజలు తమ ప్రియతమ నేతకు శుభాభినందనలతో సందేశం పంపేందుకు ఈ సేవల్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. రియాసీ బస్సుపై దాడి ఘటన.. పాక్ ఉగ్రసంస్థ హస్తం!
జమ్మూకశ్మీర్ రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై తామే దాడి చేశామని పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు సాగించే ఉగ్ర సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ ప్రకటించింది. అలాంటి దాడులను తరచూ చేస్తూనే ఉంటామని హెచ్చరించింది. మరోవైపు రియాసీలో భారీగా రంగంలోకి దిగిన సైన్యం.. ముష్కరుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. అడవుల్లో నక్కి ఉండే అవకాశం ఉండటంతో డ్రోన్లతో అణువణువూ జల్లెడ పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు (ITR) చేసే సమయం ఆసన్నమైంది. సరైన అవగాహన లేకపోయినా లేదా నిపుణుల సహాయం లేకుండా ఐటీఆర్ సమర్పించడం కొంత కష్టమైన విషయమే. ఐటీఆర్లో చేసే తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుంది. రివైజ్డ్ రిటర్నుల దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. ఎన్నికలకు ముందే.. రిషి సునాక్ రాజీనామా చేయనున్నారా?
మరికొన్ని వారాల్లో బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేయనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటిని సునాక్ తోసిపుచ్చారు. తన ప్రచారాన్ని ఆపే ప్రసక్తే లేదని.. చివరిరోజు వరకు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జులై 4న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. -
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ