‘వ్యూహం’ సినిమాపై అక్కడే తేల్చుకోండి: నిర్మాతకు స్పష్టం చేసిన హైకోర్టు

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 03 Jan 2024 12:25 IST

హైదరాబాద్‌: ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా విడుదలపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిర్మాత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకపోవడంతో రూ.కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్‌ బెంచ్‌ ఈనెల 11కు వాయిదా వేసిందని తెలిపారు. స్పందించిన హైకోర్టు.. సింగిల్‌ బెంచ్‌లోనే తేల్చుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని