kothapalli geetha: తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Published : 11 Mar 2024 18:27 IST

హైదరాబాద్‌: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆమెకు విధించిన ఐదేళ్లు శిక్షపై న్యాయస్థానం సోమవారం స్టే ఇచ్చింది. ఓ బ్యాంకును మోసం చేసిన కేసులో సెప్టెంబర్‌ 13, 2022న మాజీ ఎంపీకి సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కొత్తపల్లి గీత పోటీ చేయనున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ కోర్టు తీర్పు వల్ల పోటీకి అనర్హులయ్యే అవకాశం ఉందని వాదించారు. విచారణ అనంతరం ధర్మాసనం స్టే విధించి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని