
Jammu Kashmir: జమ్ముకశ్మీర్లో కొత్త ఏజెన్సీ.. ఎందుకంటే!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు కొత్తగా ‘స్టేట్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఐఏ)’ని ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్లోని పోలీసులతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి అరెస్టైన వారి కేసులను ఈ ఏజెన్సీ విచారించనుంది. అలాగే.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు సహాయసహకారాలు అందిస్తుంది.
జమ్ముకశ్మీర్లోని ఏ పోలీస్స్టేషన్లోనైనా ఉగ్రవాదానికి సంబంధించి కేసు నమోదైతే వెంటనే ఆయా పోలీస్స్టేషన్లోని పోలీసులు ఎస్ఐఏకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉగ్రవాద కేసులను ఎన్ఐఏ విచారించని పక్షంలో ఎస్ఐఏ విచారణకు స్వీకరిస్తుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ), పేలుడు పదార్థాలు, అటామిక్ ఎనర్జీ, యాంటీ-హైజాకింగ్, టెర్రర్ కాన్స్పిరసీ, టెర్రర్ ఫైనాన్సింగ్, ఇతర ఉగ్రవాదానికి సంబంధించిన కేసులపై ఎస్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ విభాగానికి సీఐడీ చీఫ్ ఎక్స్ అఫిషియో డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ఎస్ఐఏలో విధులు నిర్వర్తించే పోలీసులకు వారి మూలవేతనంలో 25 శాతం అదనంగా ఇవ్వనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.