Indian Army: మహిళలు, పిల్లలే పావులుగా.. ప్రమాదకర ఉగ్ర ధోరణి వెలుగులోకి!
కశ్మీర్లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు.. మహిళలు, బాలబాలికలను వినియోగిస్తున్నాయని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీనగర్: కశ్మీర్ లోయ (Kashmir Valley)లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాకిస్థాన్ ఐఎస్ఐ (Pakistan ISI), ఉగ్రవాద సంస్థలు (Terror Groups).. మహిళలు, పిల్లలను వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ(LOC) వెంబడి తిష్ఠవేసిన మూకలు.. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శ్రీనగర్కు చెందిన 15 కోర్ (చినార్ కోర్) జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ అమర్దీప్ సింగ్ ఔజ్లా తెలిపారు.
‘ప్రస్తుతం సంప్రదాయ మొబైల్ కమ్యూనికేషన్ ఉపయోగం తగ్గింది. దీంతో ఉగ్ర సందేశాలు, మాదకద్రవ్యాలు, ఆయుధాల చేరవేతకు మహిళలు, బాలబాలికలను వినియోగిస్తుండటం ముప్పుగా మారుతోంది. పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు అవలంబిస్తోన్న ఇటువంటి కొన్ని కేసులను గుర్తించాం. వాటిని నిర్మూలించేందుకు కృషిచేస్తున్నాం’ అని లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా చెప్పారు. పొరుగు దేశం తన వైఖరిని మార్చుకోలేదని.. తాజాగా ఉత్తర కశ్మీర్లోని మచిల్ సెక్టార్లో చొరబాటే దీనికి ఉదాహరణ అని పరోక్షంగా పాక్ను ఉద్దేశించి మండిపడ్డారు. అయితే, కశ్మీర్లో శాంతి, సుస్థిరత స్థాపనలో పురోగతి సాధించినట్లు చెప్పారు.
‘నిరంతర సైనిక కార్యకలాపాలు, నిఘావర్గాల సమాచారంతో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వారిలో చాలామంది ఇప్పటికే లోయను వీడారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్థానికంగా ఉగ్రవాదుల సంఖ్య 33 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది దాడులు, ఎన్కౌంటర్లు తగ్గుముఖం పట్టాయి. కశ్మీర్లో ఎల్వోసీ వెంబడి చొరబాట్లు కొంతమేర తగ్గాయి. ప్రత్యర్థి కుట్రలను అడ్డుకునేందుకు పాలనాయంత్రాంగంతోసహా అన్ని భద్రతా ఏజెన్సీలు సంసిద్ధంగా ఉన్నాయి. స్థానికంగా ‘సహీ రాస్తా (సరైన మార్గం) వంటి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.