Gen Naravane: జూన్ 16ను.. షీ ‘జిన్పింగ్’ ఇప్పట్లో మరచిపోడు!
జూన్ 16ను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమీప భవిష్యత్తులో మరచిపోడని భారత మాజీ సైనికాధికారి జనరల్ నరవణె పేర్కొన్నారు.
దిల్లీ: భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. పరిస్థితులను యుద్ధం అంచువరకు తీసుకెళ్లిన ఆ ఘటనకు సంబంధించి నాటి భారత సైనికాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె అరుదైన విషయాలు వెల్లడించారు. చైనా సైన్యాన్ని భారత సైనికులు దీటుగా తిప్పికొట్టిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. చైనా సైన్యం భారీ ప్రాణనష్టాన్ని చవిచూడటం గత రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి అన్నారు. ఈ క్రమంలో జూన్ 16ను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమీప భవిష్యత్తులో మరచిపోడని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పేరుతో నరవణె రాసిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘జూన్ 16 చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పుట్టిన రోజు. ఈ రోజును ఆయన సమీప భవిష్యత్తులో మరచిపోడు. చైనా, దాని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారీ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూడటం రెండు దశాబ్దాల్లో అదే తొలిసారి’ అని జనరల్ నరవణె పేర్కొన్నారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు అని గుర్తు చేసుకున్నారు. ఇక తమ అనైతిక వ్యూహాలతో పొరుగు దేశాలపై దాడి చేయడం చైనాకు అలవాటేనని దుయ్యబట్టారు. కానీ, పొరుగు దేశానికి సవాలు విసిరితే ఏం జరుగుతుందో భారత సైన్యం ప్రపంచానికి చాటిచెప్పిందని జనరల్ నరవణె స్పష్టం చేశారు. ఆయన రాసిన పుస్తకంలో మార్కెట్లోకి త్వరలో రానుంది.
భారత 28వ సైనికాధిపతిగా (Chief of Army Staff) జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె.. డిసెంబర్ 31, 2019 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు సేవలందించారు. తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలోకి 2020 జూన్లో చైనా సైన్యం చొరబడింది. దీనిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయి. ఆ క్రమంలో కర్నల్ సంతోష్బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులు కాగా.. చైనా వైపు భారీ ప్రాణనష్టం కలిగింది. దీనిపై చైనా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. సుమారు 40 మందికిపైగా చైనా సైనికులు చనిపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?