75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 21 తుపాకులతో చేసే గన్ సెల్యూట్కు (21-Gun Salute) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు.
డీఆర్డీఓ రూపొందించిన ఏటీఏజీఎస్ తుపాకులకు ప్రత్యేక మార్పులు
దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను (75th Independence) ఘనంగా జరుపుకొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆగస్టు 15న ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 21 తుపాకులతో చేసే గన్ సెల్యూట్కు (21-Gun Salute) స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన తుపాకులను ఉపయోగించనున్నారు. ఇందుకోసం భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలెరీ గన్ సిస్టమ్ (ATAGS) ఫిరంగులను ఉపయోగించనున్నట్లు రక్షణశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దిల్లీలోని ఎర్రకోటలో జరిగే కార్యక్రమంలో గన్ సెల్యూట్ కోసం ఇప్పటివరకు బ్రిటిష్ తుపాకులనే వాడుతున్నారు. ఈ ఏడాది మాత్రం వాటితోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో (డీఆర్డీఓ) తయారు చేసిన ఏటీఏజీఎస్ తుపాకులను వాడుతామని రక్షణశాఖ కార్యదర్శి వెల్లడించారు. అయితే, సాధారణంగా దేశ సరిహద్దుల్లో ఉపయోగించే వీటిని.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల్లో ఉపయోగించేందుకు వీలుగా ఏటీఏజీఎస్ తుపాకులకు కొన్ని మార్పులు చేశామన్నారు. పుణెలోని డీఆర్డీఓ శాస్త్రవేత్తలతోపాటు ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.
విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను భారత రక్షణ శాఖ అభివృద్ధి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు భారత సైన్యంలో ఉపయోగిస్తోన్న పాత ఫిరంగుల స్థానంలో అధునాతన 155ఎంఎం ఆర్టిలెరీ తుపాకులను ఏర్పాటు చేసే ఏటీఏజీఎస్ ప్రాజెక్టుకు డీఆర్డీఓ 2013లో శ్రీకారం చుట్టింది. దీన్ని ఆర్టిలెరీ కంబాట్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, ఫైర్ ప్లానింగ్ వంటి సీ4ఐ వ్యవస్థలకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం సులువుగా ఛేదించేలా తయారు చేసిన ఈ ఏటీఏజీఎస్ తుపాకీ ప్రయోగాలు గతంలోనే విజయవంతంగా పూర్తయ్యాయి.
మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎన్సీసీ క్యాడెట్ (NCC Cadets)లను ఆహ్వానించామని రక్షణశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ వెల్లడించారు. క్యాడెట్లతోపాటు అంగన్వాడీ వర్కర్లు, వీధి వ్యాపారులు, ముద్ర రుణాలు పొందినవారు, మార్చురీ వర్కర్లతోపాటు ఆయా రంగాల్లో చేస్తోన్న సేవలకు గుర్తుగా పలు విభాగాలకు చెందిన వారిని కూడా ఆహ్వానించామన్నారు. వీరికి అదనంగా 14 దేశాలకు చెందిన 127 మంది క్యాడెట్లనూ ఈ వేడుకలకు ఆహ్వానించామని రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.