Manipur: మణిపుర్ ఘర్షణలు రాజకీయ సమస్య.. ఆ ఆయుధాలు ఇంకా వారి చేతుల్లోనే: ఆర్మీ ఉన్నతాధికారి
భద్రతా బలగాల నుంచి అపహరించిన ఆయుధాలు తిరిగి స్వాధీనం చేసుకునే వరకు మణిపుర్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఈస్ట్రన్ కమాండ్ చీఫ్ అన్నారు.
గువాహటి: మణిపుర్ (Manipur)లో జరుగుతున్న ఘర్షణలు రాజకీయ సమస్యని, భద్రతా బలగాల నుంచి అపహరించిన వేల ఆయుధాలను స్వాధీనం చేసుకునే వరకు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయని తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత (Lt Gen Rana Pratap Kalita) అన్నారు. మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చే వారికి మణిపుర్, మిజోరాంలో భారత్ ఆశ్రయం ఇస్తోందని తెలిపారు. అయితే ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు భారత్లో ఆశ్రయం పొందేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా ఉంచినట్లు తెలిపారు.
‘‘హింసను అరికట్టి, రాజకీయపరమైన సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేలా.. ఇరు పక్షాలను ప్రోత్సహించేందుకు మేం యత్నిస్తున్నాం. ఈ సమస్యకు కచ్చితంగా రాజకీయ పరిష్కారం అవసరం. ప్రస్తుత హింస కారణంగా సర్వం కోల్పోయి.. బాధితులుగా మిగిలిన వారికి రక్షణ కల్పించి, వారికి అవసరమైన సాయం అదించడంపైనే దృష్టి సారించాం. హింసను ఆరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అందులో చాలా వరకు విజయం సాధించాం. అయితే, మెయిటీ-కుకీ వర్గాల మధ్య ఉన్న వైరం కారణంగా అక్కడక్కడా హింస చెలరేగుతోంది. భద్రతా బలగాల నుంచి అపహరించిన నాలుగువేల ఆయుధాల్లో 1,500 మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన వాటిని స్వాధీనం చేసుకునే వరకు హింస చెలరేగుతూనే ఉంటుంది’’ అని రాణా ప్రతాప్ తెలిపారు.
మయన్మార్తో సరిహద్దులు ఉండటం వల్ల అక్కడి సైన్యానికి, తిరుగుబాటుదారులకు మధ్య జరుగుతన్న ఘర్షణల కారణంగా సామాన్య ప్రజలతోపాటు, సైనిక, పోలీసు సిబ్బంది భారత్లోకి శరణార్థులగా ప్రవేశిస్తున్నారని రాణా ప్రతాప్ తెలిపారు. వీరిలో సైనిక, పోలీసు సిబ్బందిని మయన్మార్లోకి వాపస్ పంపిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో నివసించే ప్రజలు ఒకే తెగకు చెందిన వారు కావడంతో భారత్, మయన్మార్ వాసులను గుర్తించడం భద్రతా బలగాలకు కొంత కష్టంగా మారిందని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు మయన్మార్ విదేశాంగ శాఖతోపాటు మణిపుర్, మిజోరాం ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు, ఉగ్రమూకలు భారత్లోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?