Manipur Video: దేశాన్ని రక్షించినా.. భార్యను కాపాడుకోలేకపోయా..! కార్గిల్ వీరుడి దీనగాథ
యావత్ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసిన మణిపుర్ (Manipur video) అమానవీయ ఘటనలో ఓ బాధితురాలి భర్త మాజీ సైనికుడు.
ఇంఫాల్: మణిపుర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను (Manipur video) చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. ఆయుధాలు చేతపట్టిన ఓ అల్లరి మూక.. గ్రామంపై దాడి చేసి, ఇళ్లకు నిప్పు పెట్టి, యథేచ్చగా అత్యాచారాలు, హత్యలు చేసిన ఆ ఘటనలో ఓ కీలక విషయం వెల్లడైంది. దేశం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి (Indian Army) భార్య అని తెలిసింది. దీనిపై స్పందించిన ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధం (Kargil war) సమయంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ.. ఈ అమానవీయ ఘటన నుంచి మాత్రం తన భార్యను కాపాడుకోలేక పోయానని వాపోయారు.
‘కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది. కుంగుబాటుకు గురిచేస్తోంది’ అని ఓ వార్తా ఛానల్తో మాట్లాడుతూ మాజీ సైనికుడు విలపించారు. ‘మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలి’ అని ఆ కార్గిల్ వీరుడు డిమాండ్ చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన.. అస్సాం రెజిమెంట్లో సుబేదార్గా సేవలందించినట్లు సమాచారం.
నగ్నంగా ఊరేగించి.. అత్యాచారకాండ
ఇక ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన వివరాల ప్రకారం.. ‘దాదాపు 900-1000 మంది వ్యక్తులు ఏకే రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ తదితర అత్యాధునిక ఆయుధాలను పట్టుకొని ఆ గ్రామంలోకి ప్రవేశించారు. గ్రామంలోని అన్ని ఇళ్లను లూటీ చేసి ధ్వంసం చేశారు. నగదును చోరీ చేయడంతోపాటు ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం ఇళ్లకు నిప్పంటించారు. ఆ గ్రామానికి చెందిన ఐదుగురిని పోలీసులు రక్షించగా.. వారి నుంచి వాళ్లను లాక్కున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయిపై లైంగిక దాడికి యత్నించగా.. ఆమె సోదరుడు రక్షించేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిని అక్కడిక్కడే ఆ దుర్మార్గులు హత్య చేశారు’ అని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కమలా బేనీవాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బేనీవాల్ కన్నుమూశారు. ఆమె వయసు 97 ఏళ్లు. -
డిజిటల్ బాటలో పయనిస్తున్నాం
భారతీయ సుప్రీంకోర్టు 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించిందని, 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలు అయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తెలిపారు. -
భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు
భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరఫున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అటవీ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు
ఉత్తరాఖండ్లోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఉసురు తీస్తున్న వడగాలులు
వడగాలుల కారణంగా గత 30 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షన్నర మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. -
భారత నావికుల విడుదలకు ఇరాన్కు వినతి
గత ఎనిమిది నెలల్లో వివిధ అభియోగాల కింద నాలుగు వేర్వేరు రవాణా నౌకలలో అరెస్టు చేసిన 40 మంది భారతీయ నావికులను విడుదల చేయాల్సిందిగా ఇరాన్ను భారత్ కోరినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి. -
6.7%కు తగ్గిన నిరుద్యోగిత
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో గత త్రైమాసికంలో నిరుద్యోగిత స్వల్పంగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో 6.8%గా ఉన్న ఈ రేటు.. 2024 జనవరి-మార్చిలో 6.7%కు పరిమితమైందని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
వారణాసి లోక్సభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసే గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. -
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!