Meenakshi Lekhi: ‘సైలెంట్గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది’.. మీనాక్షి లేఖి వివాదాస్పద వ్యాఖ్యలు
పార్లమెంట్ వేదికగా విపక్ష నేతలను బెదిరిస్తూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘ఈడీ (ED) మీ ఇంటికి వస్తుంది’ అని ఆమె విపక్షాలను హెచ్చరించడం గమనార్హం.
దిల్లీ: అత్యంత వివాదాస్పదమైన ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023)ను లోక్సభ (Lok sabha) ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్యే సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ఈ బిల్లును దిగువ సభ గురువారం ఆమోదించింది. కాగా.. ఈ చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) ప్రతిపక్షాల (Opposition)ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపుతున్నాయి. విపక్ష నేతలు సైలెంట్గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడీ (ED) వస్తుందని ఆమె హెచ్చరించడం గమనార్హం.
‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’పై లోక్సభలో చర్చ జరుగుతుండగా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతుండగా విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. దీనిపై మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) స్పందిస్తూ.. ‘‘నిశ్శబ్దంగా ఉండండి. లేదంటే మీ ఇళ్లకు ఈడీ (ED) అధికారులు రావాల్సి ఉంటుంది’’ అని ఆమె హెచ్చరించారు.
విపక్షాల నిరసనల మధ్యే.. దిల్లీ బిల్లుకు ఆమోదం
అనంతరం ఈ బిల్లును సమర్థిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పరోక్షంగా లేఖి ఘాటు విమర్శలు చేశారు. ఆయన ‘పావు వంతు సీఎం’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘దిల్లీలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికే సగం అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అందువల్ల ఆయన (కేజ్రీవాల్ను ఉద్దేశిస్తూ) 1/4 వంతు ముఖ్యమంత్రే’’ అని విమర్శించారు.
మేం చెప్పిందే నిజమైంది: విపక్షాలు
కాగా.. మీనాక్షి లేఖి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని తాము చెప్పిన మాటలు ఇప్పుడు రుజువయ్యాయని విపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘ఆవేశంలో మీనాక్షి లేఖి విపక్షాలను బెదిరించే ప్రయత్నం చేశారు. మేం చేసిన ఆరోపణలకు ఇదే సాక్ష్యం’’ అని ఎన్సీపీ తెలిపింది. ఇక, ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ స్పందిస్తూ.. ‘‘ఇది హెచ్చరికనా? బెదిరింపా?’’ అని కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలను బెదిరించడం తీవ్ర దిగ్భ్రాంతికరమని టీఎంసీ దుయ్యబట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?