Paper Leak: యూపీలో మరో ప్రశ్నపత్రం లీకేజీ ఘటన కలకలం.. ప్రియాంక గాంధీ ఫైర్
ఆగ్రాలో 12వ తరగతి బోర్డు పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు.
దిల్లీ: ఉత్తరప్రదేశ్లో పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలు ( (UP paper leak case) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగగా.. ఆ పరీక్షల్ని యూపీ సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ 12వ తరగతి బోర్డుకు సంబంధించిన గణితం, బయాలజీ ప్రశ్నపత్రాలు పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు వచ్చిన వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర స్థాయిలో స్పందించారు.
‘మరోసారి పేపర్ లీకైంది.. ఎందుకని? బీజేపీ పాలనలో ఉద్యోగ పరీక్షల నుంచి బోర్డు పరీక్షల వరకు దాదాపు ప్రతీ పేపరూ లీక్ అవుతోంది’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రియాంక దుయ్యబట్టారు. పిల్లలు తమ భవిష్యత్తును నిర్మించుకొనేక్రమంలో ఎదుర్కొనే మొదటి ఛాలెంజ్ ఈ బోర్డు పరీక్షలేనన్న ప్రియాంక.. ఇక్కడే వారికి ఇంత ద్రోహం జరిగితే ఇక వాళ్లేం చేస్తారు? అని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న పరీక్షల మాఫియా, ప్రభుత్వంలో ఉన్న కొందరు అవినీతిపరుల్ని భాజపా కాపాడుతోందని దుయ్యబట్టారు. పిల్లలు మంచి చదువులు చదవడం ద్వారా వారి భవిష్యత్తు బాగుపడటం భాజపాకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
ఇదిలాఉండగా.. పేపర్ లీకేజీ ఘటనపై సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫతేపూర్ సిక్రీలో కేసు నమోదైంది. ఈ ఘటనపై ఫతేపూర్ సిక్రీ రాజహౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్, అదే సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఆయన కుమారుడితో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ‘ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా’ అనే వాట్సప్ గ్రూపులో ఈ ప్రశ్నపత్రాలను ప్రిన్సిపాల్ కుమారుడే పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?