S Jaishankar: మా మైండ్ గేమ్ పనిచేస్తోంది: విమర్శలకు జై శంకర్ కౌంటర్
ఇటీవలి తన రష్యా పర్యటనపై వస్తోన్న విమర్శలు, భారత్ విషయంలో పాకిస్థాన్, కెనడా అనుసరిస్తోన్న విధానాల గురించి కేంద్రమంత్రి ఎస్ జై శంకర్(S Jaishankar) స్పందించారు.
దిల్లీ: ఇతర దేశాలతో వ్యవహరించేప్పుడు భారత్ ఆలోచనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) వ్యాఖ్యానించారు. అలాగే రష్యాతో సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, అవి భారత్కు ఎంతో కీలకమని మరోసారి స్పష్టం చేశారు. తన రష్యా(Russia) పర్యటనపై పాశ్చాత్య మీడియా నుంచి వస్తోన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు.
డిసెంబర్లో జై శంకర్(S Jaishankar) రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పర్యటనలో భాగంగా అధ్యక్షుడు పుతిన్(Putin)తో భేటీ అయ్యారు. దీనిపై పాశ్చాత్య మీడియా విమర్శలు చేస్తోంది. ‘ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే.. మా మైండ్ గేమ్ పనిచేస్తున్నట్టే లెక్క. వారు ఏమైనా ఊహించుకోవచ్చు కానీ.. మా విధానం మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. రష్యాతో బంధం మాకు ఎప్పటికీ ముఖ్యమే’ అని మంత్రి బదులిచ్చారు. 2022 ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలని పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఇక ఈ పర్యటనలో ప్రధాని మోదీ సందేశాన్ని పుతిన్కు మంత్రి అందజేశారు. అదే సమయంలో రష్యాలో పర్యటించాలని మోదీ(Modi)కి పుతిన్ ఆహ్వానం పంపారు.
‘ట్రక్కు డ్రైవర్ల నిరసన.. పెట్రోల్ బంక్లకు పోటెత్తిన వాహనదారులు’
పాక్, కెనడాలపై విమర్శలు..
భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా పాక్ ప్రవర్తన అలాగే ఉందన్నారు. కానీ తమ విధానాల ద్వారా ఆ జిత్తుల్ని చిత్తు చేశామన్నారు. అలాగే కెనడాతో దౌత్యపరమైన విభేదాల గురించి స్పందించారు. ఆ దేశ రాజకీయాలు.. ఖలిస్థానీ శక్తులకు చోటు కల్పించాయని విమర్శించారు. రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసే కార్యకలాపాలను అనుమతించాయని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?