Sonia Gandhi: నైజీన్‌ సరస్సులో సోనియా గాంధీ ప్రయాణం

కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియా గాంధీ శ్రీనగర్‌లోని నైజీన్‌ సరస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 26 Aug 2023 15:57 IST

శిమ్లా: జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) తాజాగా శ్రీనగర్‌లోని నైజీన్‌ సరస్సులో బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇది కేవలం కుటుంబ పర్యటన మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కూడా ప్రస్తుతం శ్రీనగర్‌లోనే ఉన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించిన ఆయన.. శుక్రవారం ఉదయం కార్గిల్‌లో బహిరంగ ర్యాలీని పూర్తి చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. మరోవైపు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి శ్రీనగర్‌కు చేరుకోనున్నారు. వీరంతా రెండు రోజుల పాటు శ్రీనగర్‌లో గడిపి అక్కడి నుంచి గుల్మార్గ్‌కు వెళతారు. గత కొన్నేళ్లుగా శ్రీనగర్‌లోని ‘రైన్‌వారి’ ప్రాంతంలోని ఓ హోటల్‌లో రెండు రాత్రులు నిద్ర చేయడం ఈ కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోంది. అయితే, ఈ సారి రాహుల్‌ గాంధీ నైజీన్‌ సరస్సులోని బోట్‌ హౌస్‌లో ఉంటారని సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం వారి సెంట్‌మెంట్‌ మేరకు పాత హోటల్‌లోనే బస చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని