Chiranjeevi: తెలుగు సినిమా బతికినంత వరకు ప్రేక్షకుల మనసుల్లో ఆయన ఉంటారు: చిరంజీవి

అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao) శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి ఏఎన్నార్‌ను గుర్తుచేసుకుంటూ ట్వీట్‌ చేశారు.

Published : 20 Sep 2023 10:39 IST

హైదరాబాద్‌: ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswararao). నేటి నుంచి ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్‌ చేశారు.

‘అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన వందలాది చిత్రాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా బతికినంత వరకు నాగేశ్వరరావు ప్రేక్షకుల మనుసుల్లో నిలిచి ఉంటారు. ఆ మహానుభావుడి శతజయంతి సందర్భంగా అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, నా సోదరుడు నాగార్జునకు.. అలాగే నాగేశ్వరరావును అభిమానించే కోట్లాది మంది సినీ ప్రేమికులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని చిరంజీవి (chiranjeevi) ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి #ANRLiveson అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. 

ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలనుంది: ‘జవాన్‌’ దర్శకుడు

ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ నాగేశ్వరరావుకు సంబంధించిన పాత వీడియోలు ట్రెండ్‌ అవుతున్నాయి. నటీనటులు, అభిమానులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని