Pushpa2: పోరాటంతో ప్రారంభం

‘పుష్ప’ చిత్రానికి దక్కిన విజయం ‘పుష్ప2’పై భారీ అంచనాల్ని పెంచేసింది. అందుకే ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం.

Updated : 02 Nov 2022 09:03 IST

‘పుష్ప’ (Pushpa) చిత్రానికి దక్కిన విజయం ‘పుష్ప2’పై  (Pushpa2) భారీ అంచనాల్ని పెంచేసింది. అందుకే ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. అల్లు అర్జున్‌ (Allu Arjun), సుకుమార్‌ (Sukumar) కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక (Rashmika) కథానాయిక. ఈ చిత్ర రెండో భాగం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్‌ చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. తొలి షెడ్యూల్‌ ఈనెల రెండో వారంలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొదలు కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా అల్లు అర్జున్‌పై ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అక్కడ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి కథను విదేశాలతోనూ ముడిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలువురు విదేశీ నటులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని