Vishnu Vishal: నా మనసులో రవితేజకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే
ఒకొక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు... విష్ణు విశాల్. గుత్తా జ్వాలని వివాహం చేసుకున్న ఆయన... తెలుగులో రానాతో కలిసి ‘అరణ్య’ చిత్రంతో సందడి చేశారు.
ఒకొక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు... విష్ణు విశాల్. గుత్తా జ్వాలని వివాహం చేసుకున్న ఆయన... తెలుగులో రానాతో కలిసి ‘అరణ్య’ చిత్రంతో సందడి చేశారు. ఆ తర్వాత ‘ఎఫ్.ఐ.ఆర్’. ఇప్పుడు ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). చెల్లా అయ్యవు దర్శకత్వం వహించిన ‘మట్టి కుస్తీ’ డిసెంబరు 2న రానుంది. హీరో రవితేజతో కలిసి స్వయంగా నిర్మించారు విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈ సందర్భంగా ఆయన శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘పేరు చూసి ఇది ఆట నేపథ్యంలో సాగే సినిమానా అని అడిగారు చాలామంది. నేను తమిళంలో క్రికెట్, కబడ్డీ నేపథ్యంలో సినిమాలు చేయడం కూడా అందుకు ఓ కారణం. ఇది హాస్యం ప్రధానంగా సాగే భార్యాభర్తల ప్రేమకథ. నా కెరీర్లో నేను చేసిన తొలి మాస్ మసాలా సినిమా ఇదే. కథానాయిక కేరళ అమ్మాయి. అక్కడ మట్టి కుస్తీ అనే ఓ ఆట ఉంది. ఆ ఆటతో భార్యాభర్తల కథని ముడిపెట్టాం. ఇంకా ఈ సినిమాలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. కథలో భాగంగా వచ్చే వాటన్నిటినీ తెరపై చూస్తేనే మజా. ట్రైలర్లో చూపించని విషయాలు సినిమాలో చాలా ఉంటాయి. నా కెరీర్లో ఓ ట్రైలర్ని కట్ చేయడానికి నెలల సమయం పట్టింది ఈ సినిమాకే. ‘వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని చెప్పారు, కానీ రెండు అబ్ధాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అనే సంభాషణ ఇందులో ఉంటుంది. ఆ రెండు అబద్ధాలు ఏమిటనేది కూడా కీలకం. భార్యాభర్తల మధ్య అహం, దాంతో వచ్చే సమస్యల్ని వినోదాత్మకంగా చర్చించాం. ఆడవాళ్లు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండాలని మగాళ్లు భావిస్తుంటారు. ఆ అంశంపై ఓ మంచి సందేశం కూడా ఉంది. సున్నితమైన భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అందరికీ చేరువయ్యే కథ, కథనాలున్న చిత్రమిది’’.
అభ్యంతరకరమైతే తిరస్కరిస్తుంటా
‘‘సమాజంపై సినిమా ప్రభావం చాలా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకుడిని తప్పు దారి పట్టించేలా ఏ చిన్న విషయం కూడా ఉండకూడదని భావిస్తుంటా. నా దగ్గరికొచ్చే కొన్ని కథలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతాయని ముందే తెలుసు. కానీ ఆ కథల్లో ఎక్కడో ఒక చోట అభ్యంతరకమైన విషయాలు, పెద్దలకి మాత్రమే పరిమితమయ్యే విషయాలు ఉంటాయి. అందుకే మొహమాటం లేకుండా వాటిని తిరస్కరిస్తుంటా. ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటూ ఏడాదికి ఒక్కటే సినిమా చేస్తుంటా. సినిమాల్లో సందేశం ఉండొచ్చు కానీ, అది హిత బోధలా ఉండకూడదు. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది. కానీ దాన్ని హాస్య ప్రధానంగానే చెప్పాం. తెలుగు నటులు అజయ్, శత్రుతోపాటు, మనీష్కాంత్, కరుణ కింగ్స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు’’.
అన్ని పరిశ్రమలు ప్రభావం చూపిస్తున్నాయి
‘‘దక్షిణాదిలో నాలుగు పరిశ్రమల నుంచి గొప్ప చిత్రాలొస్తున్నాయి. అన్ని భాషల మధ్య ఆరోగ్య కరమైన పోటీ ఉంది. ప్రతి పరిశ్రమకీ ఒక ప్రత్యేకత ఉంది. ‘బాహుబలి’తో తెలుగు సినిమానే మొదట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ సినిమాలతో కన్నడ, ‘విక్రమ్’, ‘పీఎస్1’తో తమిళం.. ఇలాలా అన్ని పరిశ్రమలూ ప్రభావం చూపిస్తున్నాయి. మొదట్లో నేను కంటెంట్ ప్రధానమైన సినిమాలే చేసేవాణ్ని. ‘రాత్ససన్’ నా ప్రయాణాన్ని మార్చింది. వాణిజ్య ప్రధానంగా కథల్ని చెప్పాలని నిర్ణయం తీసుకునేలా చేసింది. మలయాళం శైలి కథలు, తెలుగు సినిమాల శైలిలో వాణిజ్యాంశాలు, తమిళ చిత్రాల్లాగా సెన్సిబిలిటీస్ని మేళవించి సినిమాలు చేయాలనేదే నా ముందున్న లక్ష్యం. నా నుంచి రాబోయే చిత్రాలన్నీ అదే తరహాలో ఉంటాయి’’.
రజనీకాంత్ ‘లాల్ సలామ్’లో నటిస్తున్నా
‘‘నా భార్య జ్వాలకి నటనపై ఆసక్తి లేదు కానీ, తనకి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా చూసి తన అభిప్రాయాన్ని పక్కాగా చెబుతుంది. గత మూడు చిత్రాలు ఆమె చెప్పినట్టే ఆడాయి. తదుపరి ‘మోహన్దాస్’ అనే సినిమా చేస్తున్నా. ఆ తర్వాత సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రజనీకాంత్తో కలిసి ‘లాల్సలామ్’ చిత్రంలోనూ నటిస్తున్నా. స్వతహాగా నేను క్రికెటర్ని. క్రికెట్ నేపథ్యంలో సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ‘జీవా’ అనే చిత్రం చేశా. పక్కాగా ఓ సూపర్హీరో సినిమా చేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’.
ఆయన తెలుగులో నేనే నటిస్తా అన్నారు
‘‘నా గత చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’ నుంచి రవితేజతో నా ప్రయాణం కొనసాగుతోంది. ఆ కథ నచ్చి విడుదలకి ముందు సమర్పకులుగా ఆ ప్రాజెక్ట్లో చేరారు. ఆ సమయంలోనే తర్వాతేమిటని అడిగారు. అప్పుడే ‘మట్టి కుస్తీ’ గురించి చెప్పా. చాలా బాగుందని నిర్మాణËంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత దర్శకుడిని పంపించా. కథ విన్నాక నన్ను పిలిచి, ‘నాకొక ఆలోచన వచ్చింది. నువ్వు ఈ కథని తమిళంలో చేయి, నేను తెలుగులో చేస్తా’ అన్నారు. లేదు సర్, మీరు ఈ సినిమాకి నిర్మాత మాత్రమే అని చెప్పా. నిజానికి ఆయన కామెడీ టైమింగ్కి ఈ కథ చాలా బాగుంటుంది. 13 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా. ఏదైనా ఒక సినిమా చేసే ముందు నా మార్కెట్, వ్యాపారం గురించి మాట్లాడాకే మిగతా విషయాలు ప్రస్తావనకొచ్చేవి. మార్కెట్కి తగ్గట్టే ఖర్చు పెట్టేందుకు ముందుకొచ్చేవాళ్లు. రవితేజ మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మారు. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకో అని చెప్పేవారు. ఆయనకి నాపైన ఉన్న నమ్మకం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. రవితేజకి నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
కథానాయకుడు రామ్ త్వరలో ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కానీ, దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంకా స్పష్టత ఇవ్వలేదు. -
పూజ సరికొత్త ప్రయాణం..
దక్షిణాదితోపాటు.. ఇటు బాలీవుడ్లోనూ ఇప్పటికే తానెంటో నిరూపించుకుంది కథానాయిక పూజా హెగ్డే. గతేడాది ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంతోనే సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు ఆ లోటును తీర్చడానికి వరుస సినిమాలతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. -
తెరపైనా ఫిల్మ్ స్టారే!
‘ఖో గయే హమ్ కహా’తో గతేడాదికి మంచి ముగింపే పలికింది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. ఈ ఏడాది ‘కంట్రోల్’, ‘శంకర’ లాంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె మరో చిత్రంలో కీలక పాత్రలో మెరవనుంది. -
ఇద్దరు నాయికలతో..!
వెంకటేశ్ కొత్త చిత్రం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా... సంగీతం పనులూ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. జులైలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే పేరు ప్రచారంలో ఉంది. -
తలపడితే వదలడే.. తన పేరు విజయుడే
‘రాయన్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు కథానాయకుడు ధనుష్. ఇది ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. -
‘డార్లింగ్’ పూర్తయింది
‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించనుంది నభా నటేష్. ఆమె.. ప్రియదర్శి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. -
మనోహరం... రామనామం
ప్రతి పౌరుడూ రాముడిలా బతకాలని...ధర్మబద్ధంగా మెలగాలని చెప్పే కథతోనే ‘రామ జన్మభూమి’ చిత్రాన్ని తెరకెక్కించినట్టు వి.సముద్ర తెలిపారు. ఆయన దర్శకనిర్మాతగా...జై సిద్ధార్థ్, శ్రీరాధా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రమిది. -
కేన్స్ చిత్రోత్సవంలో ‘భారత్ పర్వ్’ వేడుక
ఎన్నో ప్రఖ్యాత వేదికలపై ఇప్పటికే మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది సినిమా రంగం. ఇప్పుడు తొలిసారి భారతదేశం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘భారత్ పర్వ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మొదలైంది
అజిత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. శుక్రవారం నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభించుకుంది. -
కాండ్రకోట రహస్యం
వరుణ్సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు