Reliance Jio: జియో ఫైబర్‌ యూజర్లకు కొత్త ప్లాన్‌.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు

Reliance Jio: జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్‌తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.

Published : 11 May 2024 00:19 IST

Reliance Jio | ఇంటర్నెట్‌ డెస్క్‌: జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్‌ కస్టమర్ల కోసం జియో (Reliance Jio) కొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. రూ.888తో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, డిజిటల్‌ టీవీ ప్రసారాలు, ఓటీటీ ప్రయోజనాలతో ఈ ప్లాన్‌ వస్తోంది. కొత్త వినియోగదారులతో పాటు ఇప్పటికే జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ వినియోగదారులు ఈ ప్లాన్‌కు మారొచ్చని కంపెనీ తెలిపింది.

జియో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్‌ వేగంతో అన్‌లిమిటెడ్‌ డేటా (ఎయిర్‌ ఫైబర్‌కు వెయ్యి జీబీ/ జియో ఫైబర్‌కు 3300 జీబీ) లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జియో సినిమా ప్రీమియం వంటి 15 ఓటీటీ యాప్స్‌ లభిస్తాయి. 800 డిజిటల్‌ టీవీ ఛానెళ్లు కూడా పొందొచ్చని జియో తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్‌ ధన్‌ధనా ధన్‌ ఆఫర్‌ కూడా వర్తిస్తుంది. దీని కింద జియో ఫైబర్‌, ఎయిర్‌ ఫైబర్‌ కస్టమర్లు 50 రోజులు పాటు ఉచితంగా సేవలను ఆనందించొచ్చు. మే 31తో ఈ ఆఫర్‌ ముగియనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని