Bigg Boss Telugu 7: 15 నిమిషాల్లో అమర్‌ కేకు తినగలిగితే.. సర్‌ప్రైజింగ్‌ టాస్క్‌!

Published : 05 Dec 2023 14:46 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 (Bigg Boss Telugu 7) మరో రెండు వారాల్లో ముగియనుంది. సోమవారం తీవ్ర వాగ్వాదాల మధ్య నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసింది. మరోవైపు ఇప్పటికే ఫినాలే టికెట్‌ గెలుచుకున్న అర్జున్‌ నేరుగా చివరి వారానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అర్జున్‌ తప్ప హౌస్‌లో ఉన్న శివాజీ, ప్రశాంత్‌, యావర్‌, అమర్‌, ప్రియాంక, శోభ అందరూ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఓటింగ్‌ లైన్స్‌ రెండు వారాల పాటు తెరిచే ఉంటాయని ప్రకటించారు. నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత హౌస్‌లో టాస్క్‌ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో కెప్టెన్‌ అమర్‌కు కేక్‌ తినే టాస్క్‌ ఇచ్చాడు. కేవలం 15 నిమిషాల్లో మొత్తం కేకును ఒక్కడే తింటే, మిగిలిన ఇంటి సభ్యులకు కూడా కేక్‌ తినే అవకాశం ఇస్తానని బిగ్‌బాస్‌ చెప్పాడు. మరి అమర్‌దీప్‌ కేక్‌ తిన్నాడా? లేదా? తెలియాలంటే ఎపిసోడ్‌ చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని