Sameera Reddy: కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా కామెంట్‌ చేశాడు: సమీరారెడ్డి

నటి సమీరారెడ్డి (Sameera Reddy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనకెదురైన విమర్శల గురించి మాట్లాడారు.

Updated : 13 Aug 2023 10:24 IST

ముంబయి: ‘అశోక్‌’, ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటి సమీరారెడ్డి (Sameera Reddy). వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అక్షయ్‌తో వివాహం, పిల్లలు, తనకు ఎదురైన విమర్శల గురించి మాట్లాడారు. 

‘‘2014లో అక్షయ్‌తో నాకు వివాహమైంది. మా ఇంటి టెర్రస్‌పైనే చాలా సింపుల్‌గా మా పెళ్లి జరిగింది. నేను ప్రెగ్నెంట్‌ని అయ్యానని.. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని పలువురు మాట్లాడుకున్నారు. వాళ్ల మాటల్లో నిజం లేదు. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి సింపుల్‌గా జరిగింది’’

పెళ్లి కుమార్తెగా మృణాల్‌.. ప్రేమలోకంలో నయన్‌-విఘ్నేశ్‌.. రష్మిక ముద్దులు

‘‘ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ సమయంలో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. 2015లో బాబు పుట్టిన తర్వాత బరువు బాగా పెరిగా. శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్లు నన్ను కామెంట్‌ చేశారు. చివరికి కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా.. ‘‘దీదీ మీకు ఏమైంది? ఇది మీరేనా?’’ అని అన్నాడు. వాళ్ల విమర్శలు నన్ను ఎంతో భయపెట్టాయి. ఫొటోగ్రాఫర్స్‌కు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లలేదు’’

‘‘వ్యక్తిగత జీవితంలో ఫుల్‌ బిజీ అయిపోయిన నేను.. తిరిగి అభిమానులతో కనెక్ట్‌ కావాలనుకున్నా. అందుకు సోషల్‌మీడియా సులువైన మార్గం అనిపించింది. ఇన్‌స్టాలో అకౌంట్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత దాన్ని కాస్త ప్రమోట్‌ చేయాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఉన్న స్నేహితులకు ఫోన్‌ చేశా. ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు. బాధగా అనిపించింది’’ అని ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని