Jabardasth: ‘జబర్దస్త్’ నటులు.. కన్నీటి వ్యథలు
‘ఎక్స్ట్రా జబర్దస్త్’ తాజా ఎపిసోడ్ ప్రోమో. రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘బజర్దస్త్’ నటులు సుధీర్, శ్రీను, నరేశ్.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వాగదు. అంతగా తమని తాము మలుచుకున్నారు. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా సాధ్యంకాలేదు. వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.. నీళ్లతోనే కడుపు నింపుకున్నారు. తెర వెనక వీళ్లు పడిన ఆ కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్, నూకరాజు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వేదికగా తెరపైకి తీసుకొచ్చారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ 350వ ఎపిసోడ్కి చేరుకుంది. సెప్టెంబరు 3న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఓ వైపు ఆనందం, అల్లరి.. మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. రాకింగ్ రాకేశ్, రోహిణి భార్యభర్తలుగా నవ్వులు పంచగా.. జగదేక వీరుడు- అతిలోక సుందరిలా రామ్ ప్రసాద్- శ్రీను, అమ్రిష్ పురిలా సుధీర్ దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. బుల్లెట్ భాస్కర్- వర్ష జోడీ సందడి చేసింది. రాము, కుటుంబ సభ్యులు.. హరికృష్ణ, సతీమణి.. హరి, సోదరి.. సాయి, వాళ్ల నాన్న తళుక్కున మెరిశారు. తన తల్లి ఎంతో కష్టపడి తన తండ్రిని బతికించిందని చెప్పి సాయి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘బజర్దస్త్ ఆర్టిస్టుల లైఫ్ జర్నీ స్కిట్’ పేరుతో నరేశ్ తాను ఎదుర్కొన్న అవమానాల్ని చూపించాడు. సుధీర్, శ్రీను పడిన కష్టాల్ని కార్తీక్, ఇమ్మాన్యుయేల్ కళ్లకు కట్టినట్టు చూపించారు. హృదయాన్ని బరువెక్కించారు. మరి సుధీర్, శ్రీను ఈ స్కిట్పై ఎలా స్పందించారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..