భాజపాకు రావుల శ్రీధర్‌రెడ్డి రాజీనామా

తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి, ముఖ్యనేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Published : 01 Nov 2020 17:25 IST

హైదరాబాద్‌: తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి, ముఖ్యనేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. తనతోపాటు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వివిధ డివిజన్ల నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరనున్నట్లు వెల్లడించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని.. ఆ పార్టీతో తెలంగాణకు న్యాయం జరగదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెరాంగాణ పురోగమిస్తోందన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోందని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనా గత పదేళ్లుగా ప్రజల్లోనే ఉన్నానని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని