atchannaidu: చంద్రబాబుకి ప్రజల మద్దతు చూసి.. జగన్ వణికిపోతున్నారు: అచ్చెన్నాయుడు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైకాపా నేతలు వణికిపోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైకాపా నేతలు వణికిపోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైకాపా నేతలకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఈ భూమ్మీద తానే అపర మేధావి అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు నిబంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారని.. నిబంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారని తెలిపారు.
లోకేశ్ దిల్లీ వెళ్తే అధికార పార్టీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు బెయిల్పై బయటకొస్తే వైకాపా నేతలు వణికిపోతున్నారన్నారు. స్కిల్ కేసులో ఒక్క ఆధారం సేకరించలేకపోయారని, ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబుపై మరో అక్రమ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు అని స్పష్టం చేశారు. మరో ఐదు నెలల తర్వాత వైకాపా నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..