KCR: కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయం: కేసీఆర్‌

మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య ఆదివారం భారాస అధినేత కేసీఆర్‌ను కలిశారు.

Published : 14 Apr 2024 21:22 IST

హైదరాబాద్‌: మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య ఆదివారం భారాస అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ భారాస ఇన్‌ఛార్జిగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌లో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని