నా ఓఎస్డీపై కఠినచర్యలు తీసుకోండి:సిసోడియా
అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ, ఐఎస్ అధికారి గోపాల్ కృష్ణ మాధవ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు...........
దిల్లీ: అవినీతి ఆరోపణల కింద అరెస్టయిన తన ఓఎస్డీ గోపాల్ కృష్ణ మాధవ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కోరారు. మరికొన్ని గంటల్లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిసోడియా వద్ద ఉన్న అధికారి అవినీతి ఆరోపణల కింద అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన సిసోడియా.. గోపాల్ కృష్ణని అరెస్టు చేయడం సమంజసమేనని.. వీలైనంత త్వరగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతన్ని ఎలాంటి తరుణంలో అరెస్టు చేశారన్న దానిపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. లంచం తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
ఓ పన్ను ఎగవేత కేసులో నిందితుల దగ్గరి నుంచి గోపాల్ కృష్ణ లంచం తీసుకున్నాడన్న ఆరోపణల కింద సీబీఐ ఆయన్ని గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసింది. ఈ వ్యవహారంతో సిసోడియాకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తేలినట్లు సమాచారం.
మరోవైపు గోపాల్ కృష్ణ అరెస్టు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీపై భాజపా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. మనీష్ సిసోడియా తరఫున లంచం తీసుకుంటూ ఓఎస్డీ పట్టుబడ్డారంటూ తీవ్రంగా ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం లోక్పాల్ని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. శనివారం దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్ విజయానికి కృషి చేస్తా: ముద్రగడ కుమార్తె క్రాంతి
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?