వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పార్టీ తరఫున పోటీ చేస్తా
పేద ప్రజల కోసం పోరాటం చేసేందుకు ప్రముఖ రాజకీయ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైయస్ఆర్ జిల్లా
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
బ్రహ్మంగారిమఠం, న్యూస్టుడే: పేద ప్రజల కోసం పోరాటం చేసేందుకు ప్రముఖ రాజకీయ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైయస్ఆర్ జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, తన వద్దకు ఎవరైనా వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నానని చెప్పారు. రెడ్లు అందరం ఒకటవుదామని స్వయానా జగన్రెడ్డి కోరడంతో గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే, అందరినీ ముంచేశాడని విమర్శించారు. గత ప్రభుత్వం పేదలకు అసైన్మెంట్ కమిటీల ద్వారా ‘డి’ పట్టాలిచ్చి భూపంపిణీ చేయగా, అవి లబ్ధిదారులకు చూపించకుండానే రాజకీయ నాయకుల చేతుల్లోకి చేరాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.