‘తెరాస అభ్యర్థులనే గెలిపిస్తాం’

వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్‌లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణలను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు.

Published : 29 Nov 2021 03:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్‌లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణలను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడారు. గంగుల ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని.. ఆయన పిలుపు మేరకు పనిచేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని