Kishan Reddy: ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు: కిషన్రెడ్డి
దేశ సంపదను దోచుకున్న కాంగ్రెస్ కావాలా? నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని మోదీ కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోరారు.
జహీరాబాద్: దేశ సంపదను దోచుకున్న కాంగ్రెస్ కావాలా? నీతివంతమైన పాలన అందిస్తున్న ప్రధాని మోదీ కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోరారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ గ్యారంటీ ప్రకారం ప్రజలకు అవినీతి రహిత పాలన అందించామని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్కు సంబంధించినవన్నారు.
‘‘రాహుల్ గాంధీపై కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు.. కేసీఆర్ మీద కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ వచ్చిన 90 రోజుల్లోనే దందా మొదలు పెట్టింది. డబ్బులు వసూలు చేసి రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు. వంద రోజుల్లోనే దిల్లీకి సూట్కేసులు మోస్తున్నారు. తెలంగాణకు భారాస అవసరం లేదు’’ అని కిషన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.