BJP: మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను భాజపాలోకి ఆహ్వానించిన కిషన్‌రెడ్డి

భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపాలోకి ఆహ్వానించారు.

Updated : 08 Mar 2024 16:36 IST

హనుమకొండ: భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపాలోకి ఆహ్వానించారు. శుక్రవారం హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి పార్టీలోకి రావాలని కోరారు. రాజ్యసభ సభ సీటు ఆశించినా.. దక్కకపోవడంతో సీతారాం నాయక్‌ భారాసపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని