Kishan Reddy: కాంగ్రెస్‌ మరోసారి నిజ స్వరూపం బయటపెట్టింది: కిషన్‌ రెడ్డి

ప్రజలను మభ్యపెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు.

Updated : 02 Feb 2024 14:37 IST

హైదరాబాద్‌: ప్రజలను మభ్య పెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ‘‘నిరుద్యోగ యువత కోసం ఫిబ్రవరి 1న గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో కాంగ్రెస్‌ పేర్కొంది. ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది’’ అని చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. 

‘‘నిన్ననే ఒకటో తేదీ.. ఇది ఫిబ్రవరి నెలే. ఇంతవరకూ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రాలేదు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది. ఇదే తరహాలో ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోంది’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని