Sonia gandhi : సోనియాగాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia gandhi) ప్రయాణిస్తున్న విమానాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
దిల్లీ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా భోపాల్లో ల్యాండ్ అయ్యింది. బెంగళూరులో విపక్షాల భేటీ ముగించుకొని ఆమె దిల్లీకి బయలుదేరారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు భోపాల్లో విమానాన్ని అత్యవసరంగా కిందకి దించినట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో 26 విపక్ష పార్టీలు రెండు రోజులపాటు సమావేశమయ్యాయి. ఆ భేటీల్లో సోనియా పాల్గొన్నారు.
ఐఫోన్ అంటేనే జంకుతోన్న రష్యా.. ఎందుకంటే..?
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు బెంగళూరు వేదికగా ప్రతిపక్ష నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో విపక్షాల కూటమికి I-N-D-I-A అనే పేరును నిర్ణయించారు. ప్రతిపక్షాల ఫ్రంట్కు ఇకపై ‘భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I-N-D-I-A)’గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.