IND vs SL: టీమ్ఇండియా చెత్త రికార్డు.. 49 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి
ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. మ్యాచ్లో భారత్ విజయం సాధించినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో భాగంగా మంగళవారం శ్రీలంక (Srilanka)తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా భారీ స్కోరు చేస్తుందని భావించగా.. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి 213 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా బౌలర్లు కూడా చెలరేగడంతో ఆతిథ్య శ్రీలంక 172 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఆసియా కప్ ఫైనల్ : భారత్ vs పాక్ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?
మ్యాచ్లో భారత్ పదికి పది వికెట్లు స్పిన్నర్లకే సమర్పించుకుంది. 49 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో బ్యాటర్లందరూ ఇలా స్పిన్ బౌలింగ్లో ఔట్ కావడం ఇదే మొదటిసారి. యువ స్పిన్ ఆల్రౌండర్ దునిత్ వెల్లలాగె (40/5) టీమ్ఇండియా టాప్ ఆర్డర్ను పెవిలియన్కు పంపాడు. తర్వాత అసలంక (4/18) విజృంభించగా.. మహీశ్ తీక్షణ చివరి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ను ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక అరుదైన రికార్డును అందుకుంది. వన్డేల్లో వరుసగా 14 సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 13 మ్యాచ్ల్లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న శ్రీలంకకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్లో శుక్రవారం బంగ్లాదేశ్ను ఢీకొననుంది. అంతకంటే ముందు గురువారం కీలక పోరులో పాక్, లంక తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్ను ఢీకొంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మెరుగైన రన్రేట్ కలిగిన శ్రీలంక ఫైనల్ చేరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.