Chetan Sharma: ఫిట్నెస్ కోసం ఇంజక్షన్లు: చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన ఆరోపణలు
కొందరు భారత క్రికెటర్లు కీలక మ్యాచ్లకు ముందు ఫిట్నెస్ కోసం ఇంజక్షన్లు తీసుకొని బరిలోకి దిగుతున్నట్లు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఆరోపించాడు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఆయన షాకింగ్ విషయాలను వెల్లడించాడు.
ఇంటర్నెట్డెస్క్: బీసీసీఐ (BCCI) చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ(Chetan Sharma) టీమిండియా క్రికెటర్లపై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన రహస్య స్టింగ్ ఆపరేషన్లో ఆయన భారత జట్టులో నెలకొన్న పరిస్థితులపై పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఫిట్నెస్ కోసం క్రికెటర్లు ఇంజక్షన్లు తీసుకోవడం, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీల మధ్య పొరపొచ్చాలు లాంటి విషయాలను ఇందులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి వీడియో క్లిప్పులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కొందరు భారత క్రికెటర్లు ఫిట్గా లేనప్పటికీ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని చేతన్ శర్మ ఆరోపించాడు. వారు తీసుకుంటున్న ఇంజక్షన్లను డోపింగ్ పరీక్షల్లో సైతం గుర్తంచలేరని తెలిపాడు. 80 శాతం ఫిట్గా ఉన్న ఆటగాళ్లు కీలకమైన మ్యాచ్లకు ముందు ఇంజక్షన్లు తీసుకొని పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లుగా చూపి మ్యాచ్లు ఆడుతున్నట్లు చేతన్ శర్మ ఆరోపించాడు. గత సెప్టెంబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా బుమ్రా జట్టులో స్థానం దక్కించుకునే క్రమంలో తనకు జట్టు యాజమాన్యానికి అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలిపాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పాడు. మరోవైపు టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయని, వాటికి కోహ్లీ, రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కోహ్లీల మధ్య కూడా అంతర్గత చర్చలకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. జట్టుకు సంబంధించిన రహస్య వివరాలు బయటకు రావడంపై బీసీసీఐ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి