బీసీసీఐ గిన్నిస్‌ రికార్డు

బీసీసీఐ మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఓ టీ20 మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

Published : 28 Nov 2022 01:48 IST

దిల్లీ: బీసీసీఐ మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఓ టీ20 మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది మే 29న ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌ను 1,01,566 మంది ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సంఖ్య ఇప్పుడు గిన్నిస్‌ పుస్తకాల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. గిన్నిస్‌ ప్రపంచ రికార్డును కార్యదర్శి జై షా స్వీకరిస్తున్న ఫొటోను బీసీసీఐ ఆదివారం ట్వీట్‌ చేసింది. ఆ ఫైనల్లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని