IND w Vs AUS w: ఆసీస్‌ అజేయ టీం ఏమీ కాదు.. భారత్‌కూ గెలుపు అవకాశం: ఇయాన్

Eenadu icon
By Sports News Team Published : 30 Oct 2025 12:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో (Womens ODI World Cup) రెండో సెమీస్‌కు సమయం ఆసన్నమవుతోంది. బలమైన ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా ఢీకొట్టనుంది. నాకౌట్‌ స్టేజ్‌లో ఆసీస్‌ను ఓడించడం చాలా కష్టమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తుండగా.. విండీస్‌ దిగ్గజం ఇయాన్‌ బిషప్‌ మాత్రం అదేమీ కష్టం కాదని వ్యాఖ్యానించాడు. సహచరులపై నమ్మకం ఉంచితే ఆస్ట్రేలియాను ఓడించవచ్చని భారత్‌కు సలహా ఇచ్చాడు. స్వదేశంలో ఆడనుండటం కలసి వస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు.

‘‘ఆస్ట్రేలియా వంటి మంచి జట్టుతో ఆడటం తేలికైన విషయం కాదని గుర్తించాలి. అదే సమయంలో ఆ టీమ్‌ను ఓడించడం కూడా అసాధ్యం కాదని భావించాలి. ఎందుకంటే వారేమీ అజేయులు కారు. నాణ్యమైన టీమ్‌ మాత్రమే. దూకుడుగా సాహసోపేతంగా ఆడే టీమ్‌. భారతజట్టును దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటే మాత్రం ‘ఇది క్రికెట్‌. ఏదైనా సాధ్యమే’ అని చెబుతా. ప్లేయర్లకు ఈ ఒక్క మ్యాచ్‌ ఏమీ జీవితం లేదా మరణం కాదు. ప్రతి ఒక్కరూ కామ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉండాలి. అప్పుడే ఛాంపియన్‌ టీమ్‌ను ఓడించేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు వీలవుతుంది. ఒత్తిడికి గురైతే మాత్రం ఆసీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించడం చాలా కష్టం. గత 11 మ్యాచుల్లో ఆసీస్‌ను భారత్‌ ఒక్కసారి మాత్రమే ఓడించింది. అయినా సరే, నమ్మకంతో బరిలోకి దిగాలి. ఆస్ట్రేలియాకు అడ్వాంటేజ్‌ ఉన్నప్పటికీ భారత్‌ సెమీస్‌లో గెలుస్తుందని నేను భావిస్తున్నా’’ అని బిషప్ తెలిపాడు.

ఒకటే మైండ్‌సెట్‌తో..

‘‘ప్రతీకా రావల్‌కు బదులు షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఆమెకు ఇదే తొలి మ్యాచ్‌. తనదైన మైండ్‌సెట్‌తో వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని షెఫాలీ భావిస్తోంది. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉంటూ మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని కోరుకుంటున్నా. ప్రతీకా లేని గ్యాప్‌ను పూరించాలి. తుది జట్టు కూర్పు కూడా అత్యంత కీలకం. మరింత మెరుగైన బౌలింగ్‌ డెప్త్‌ ఉండాలని సూచిస్తా. బ్యాటర్లు బాధ్యత తీసుకుని ఆడాలి. ఎందుకంటే ఆసీస్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ డెప్త్‌ ఎక్కువ. టీమ్‌ఇండియా కూడా అదే కూర్పుతో బరిలోకి దిగాలి’’ అని ఇయాన్ బిషప్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు