Shoaib Akhtar: భారత్, పాక్ ఫైనల్ ఆడాలి.. అభిమానులతో ముచ్చటించాలి
ఆసియా కప్ గ్రూప్-4లో రెండు ఓటములతో ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది టీమ్ఇండియా. భారత జట్టు ఫైనల్ చేరాలంటూ అద్భుతాలు జరగాల్సిందే........
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ గ్రూప్-4లో రెండు ఓటములతో ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది టీమ్ఇండియా. భారత జట్టు ఫైనల్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘భారత్, పాక్ ఫైనల్లో ఆడాలని నేను కోరుకుంటున్నా. ఫైనల్ టికెట్లు ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. మ్యాచ్ను చూస్తూ.. భారత్, పాక్ అభిమానులతో ముచ్చటించాలని ఉంది’ అని తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.
రానున్న టీ20 ప్రపంచ కప్లో భారత్, పాక్ జట్లు పోటీపడే మ్యాచ్ను కూడా వీక్షించేందుకు తాను సిద్ధమైనట్లు అక్తర్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో జరగబోయే ఈ వరల్డ్ కప్ టోర్నీలో మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23వ తేదీన ఈ జట్లు తలపడనున్నాయి. ‘మెల్బోర్న్ సైతం వెళ్లి పాకిస్థాన్ మ్యాచ్లను వీక్షిస్తా’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
రోహిత్ శర్మ తన కెప్టెన్సీకి పదును పెట్టాలి
ఆసియా కప్లో టీమ్ఇండియా తన ఓటములకు కారణాలు తెలుసుకొని వాటిని అధిగమించాలని అక్తర్ పేర్కొన్నాడు. కుంగిపోవాల్సిన అవసరం లేదన్నాడు. ‘భారత్ చెత్తగా ఏం ఆడలేదు. కానీ వారి ప్రదర్శన అభిమానులకు సంతృప్తినివ్వలేదు. భారత జట్టు పుంజుకుంటుందని ఆశిస్తున్నా. ఇది ప్రపంచకప్లో వారికి ఉపయుక్తంగా ఉంటుంది’ అని పేర్కొన్నాడు. ‘కెప్టెన్ రోహిత్ మంచి కాంబినేషన్ను గుర్తించాలి. ఓపిగ్గా ఉంటూ తన కెప్టెన్సీకి పదునుపెట్టాలి’ అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!