ICC U19 World Cup 2024: ఆతిథ్య వేదికను మారుస్తూ ఐసీసీ నిర్ణయం
అండర్-19 వరల్డ్ కప్ ఆతిథ్య వేదికను మార్చినట్లు ఐసీసీ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది.
అహ్మదాబాద్: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ (ICC U19 World Cup 2024) ఆతిథ్య వేదికలో మార్పు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లను శ్రీలంకలో కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నట్లు మంగళవారం ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC)పై ఐసీసీ నిషేధం విధించిన 11 రోజుల తర్వాత ఆతిథ్య వేదికలో మార్పు చోటు చేసుకోవడం గమనార్హం.
‘‘ఎస్ఎల్సీపై నిషేధం కారణంగా అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య వేదికను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు మార్చడం జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని టోర్నీలో పాల్గొంటున్న జట్లకు తెలియజేశాం. 2020లో దక్షిణాఫ్రికా అండర్-19 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్పై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు తెలిపారు.
గత నెలలో ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీలంకలో మ్యాచ్లు జరుగుతాయని ప్రకటించింది. తాజాగా ఆతిథ్య వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. కొద్దిరోజుల క్రితం తమపై నిషేధం ఎత్తివేయాలని ఐసీసీని ఎస్ఎల్సీ కోరింది. వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఘోర వైఫల్యం తర్వాత ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్సీని శ్రీలంక క్రీడా శాఖ రద్దు చేసింది. దీనిపై ఎస్ఎల్సీ కోర్టును ఆశ్రయించడంతో క్రీడా శాఖ నిర్ణయంపై స్టే విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఎల్సీపై రాజకీయ జోక్యాన్ని తప్పుబడుతూ శ్రీలంక బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.