IND vs ENG: భారత్దే వైజాగ్ టెస్టు.. ఇంగ్లాండ్పై 106 పరుగుల తేడాతో విజయం
రెండో టెస్టు మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 292 పరుగులకే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో (IND vs ENG) రెండో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి టెస్టులో విజయానికి కాస్త చేరువగా వచ్చిన టీమ్ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి ఇంగ్లాండ్ నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. కీలక సమయాల్లో వికెట్లు తీసిన భారత్ గెలిచి ఐదు టెస్టుల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టీమ్ఇండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు రెండో సెషన్లోపే ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా ప్రారంభం కానుంది.
తొలి సెషన్లోనే..
ఓవర్నైట్ 67/1 స్కోరుతో లక్ష్య ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్కు తొలి సెషన్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. కీలక సమయంలో వికెట్లను సమర్పించారు. మరీ ముఖ్యంగా అశ్విన్ కట్టుదిట్టమైన బౌలింగ్తో విజృంభించాడు. రెహాన్ (23)ను ఎల్బీ చేసిన అక్షర్ పటేల్ వికెట్ల పతనానికి తెరదీశాడు. కీలకమైన ఓలీ పోప్ (23), జో రూట్ (16)ను అశ్విన్ ఔట్ చేశాడు. పోప్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఒడిసిపట్టాడు. లంచ్ బ్రేక్కు కాస్త ముందు బెయిర్ స్టో (26)ను బుమ్రా, జాక్ క్రాలేను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కథ ముగిసింది. డీఆర్ఎస్కు వెళ్లినా బ్యాటర్లకు అనుకూలంగా ఫలితం రాలేదు.
వారు కాసేపు..
ఇంగ్లాండ్ 43 ఓవర్లకు 194/6 స్కోరుతో ఉండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లోకి వచ్చాడు. బెన్ ఫోక్స్తో కలిసి దాదాపు పది ఓవర్లపాటు వికెట్ ఇవ్వకుండా భారత బౌలింగ్ను అడ్డుకున్నాడు. అయితే, అనవసర పరుగుకు యత్నించిన బెన్ స్టోక్స్ను (11) శ్రేయస్ అయ్యర్ డైరెక్ట్ హిట్తో రనౌట్ చేశాడు. చివర్లో ఫోక్స్ (36), హార్ట్లీ (36) కాసేపు పోరాడినా.. ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు అర్ధశతక (55) భాగస్వామ్యం నిర్మించారు. దీంతో టీమ్ఇండియా శిబిరంలో ఆందోళన రేగింది. చివరికి వీరి జోడీని బుమ్రా విడగొట్టాడు. స్లో బంతిని సంధించి రిటర్న్ క్యాచ్తో ఫోక్స్ను పెవిలియన్కు పంపాడు. ఆఖరి రెండు వికెట్లను ముకేశ్, బుమ్రా తీసి ఇంగ్లాండ్ కథ ముగించారు. భారత బౌలర్లు అశ్విన్ 3, బుమ్రా 3, కుల్దీప్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
స్కోరు వివరాలు:
భారత్: తొలి ఇన్నింగ్స్ 396/10. రెండో ఇన్నింగ్స్ 255/10
ఇంగ్లాండ్: తొలి ఇన్నింగ్స్ 253/10. రెండో ఇన్నింగ్స్ 292/10
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం
-
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు