IND vs ENG: ఇంగ్లాండ్పై బుమ్రా ‘సిక్సర్’.. రెండో రోజు ముగిసిన ఆట
భారత్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.
విశాఖపట్నం: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (6/45) విజృంభించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో పర్యటక జట్టు 253 పరుగులకే ఆలౌటైంది. ఈక్రమంలో మొదటి ఇన్నింగ్స్లో భారత్కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13*), యశస్వి జైస్వాల్ (15*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆధిక్యం 171 రన్స్.
బుమ్రా దెబ్బకు బెంబేలు..
ఇంగ్లాండ్ ఈ మాత్రం స్కోరు చేయగలిగిందంటే దానికి కారణం ఇద్దరు.. ఓపెనర్ జాక్ క్రాలీ (76; 78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం బాదాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, కెప్టెన్ బెన్స్టోక్స్ (47; 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడు ప్రదర్శించాడు. తొలుత బెన్ డకెట్ (21)ని కుల్దీప్ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడుతున్న క్రాలీ.. అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి శ్రేయస్ అయ్యర్కు దొరికిపోయాడు. అనంతరం బుమ్రా తన వరుస ఓవర్లలో జో రూట్ (21), తొలి మ్యాచ్ సెంచరీ హీరో ఓలీ పోప్ (23)ని పెవిలియన్కు పంపాడు. టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 155/4 స్కోరుతో నిలిచింది.
మూడో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికి బుమ్రా బౌలింగ్లో బెయిర్స్టో (25).. స్లిప్లో గిల్కు చిక్కాడు. కుల్దీప్ యాదవ్ స్వల్పవ్యవధిలో బెన్ ఫోక్స్ (6), రెహాన్ అహ్మద్ (6)లను వెనక్కి పంపాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న స్టోక్స్ని బుమ్రా క్లీన్బౌల్డ్ చేసి టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అదుకున్నాడు. చివరి రెండు వికెట్లు హార్ట్లీ (21), జేమ్స్ అండర్సన్ (6) కూడా బుమ్రాకే దక్కాయి. కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు 336/6 స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన రోహిత్ సేన.. 396 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ బాదాడు.
అతి తక్కువ బంతుల్లో 150 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
- 6781- జస్ప్రీత్ బుమ్రా
- 7661- ఉమేశ్ యాదవ్
- 7755- మహ్మద్ షమి
- 8378- కపిల్ దేవ్
- 8380- రవిచంద్రన్ అశ్విన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM