Rinku Singh: అప్పుడు కేకేఆర్ అకాడమీలో చేసిన శ్రమకు ఫలితమిది: రింకు సింగ్
తన ఆటతీరు మెరుగు కావడానికి ప్రధాన కారణమేంటో కోల్కతా నైట్రైడర్స్ (KKR) ఆటగాడు రింకు సింగ్ (Rinku Singh) వెల్లడించాడు. అలాగే టీమ్ఇండియా మాజీ క్రికెటరే తనకు ఆదర్శమని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్పై (GT) ఒకే ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టి కోల్కతా నైట్రైడర్స్ను (KKR) గెలిపించిన రింకు సింగ్ (Rinku Singh) గుర్తుండే ఉంటాడు. ఆ తర్వాత కూడా కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. మూడు రోజుల కిందట పంజాబ్పైనా చివరి బంతికి బౌండరీ కొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు కోల్కతా సిద్ధమైంది. ప్లేఆఫ్స్ అవకాశాలు నిలవాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోసారి రింకు చెలరేగిపోవాలని కేకేఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. కోల్కతా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రింకు సింగ్ కావడం విశేషం. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 151.12 స్ట్రైక్రేట్తో 337 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రింకు సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. రాజస్థాన్తో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్లో రింకు సింగ్ మాట్లాడాడు. మ్యాచ్లు లేని సమయంలోనూ కేకేఆర్ అకాడమీలో ప్రాక్టీస్ చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నాడు.
‘‘కేకేఆర్ అకాడమీలో కఠిన శ్రమ చేయడంతోనే ఇప్పుడీ సీజన్లోనూ రాణించగలుగుతున్నా. మ్యాచ్లు లేని సమయంలోనూ మా కోసం క్యాంప్లను ఏర్పాటు చేయడం జరిగింది. సాధనతో నా ఆటతీరును మెరుగుపర్చుకున్నా. డెత్ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడానికి నెట్స్లోనూ ప్రాక్టీస్ చేశా. నేను బ్యాటింగ్కు దిగే స్థానాన్ని బట్టి షాట్లను సాధన చేసేవాడిని. సింపుల్ షాట్లను మాత్రమే ఆడతా. విభిన్న షాట్లు కొడదామని ప్రయత్నిస్తే నా బ్యాటింగ్పైనే ప్రభావం పడుతుంది. అందుకే, బంతి ఎలా వస్తుందనేదానిని అంచనా వేసి భారీ షాట్లు కొడతా. ఫినిషింగ్ చేయడంలో ఎంఎస్ ధోనీ దిట్ట. అతడి నుంచి ఎన్నో సూచనలు పొందా. నేను బ్యాటింగ్కు దిగినప్పుడు ఎలా ఆడాలని ధోనీని అడిగితే.. ఒకటే మాట చెప్పాడు. మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. బంతి కోసం వేచి ఉంటే చాలు. ఇదే ధోనీ నాకిచ్చిన విలువైన సలహా. నేను ఎక్కువగా సురేశ్ రైనా ఆటను ఇష్టపడతా. అయితే, ఇతరులను అనుకరించాలని మాత్రం అనుకోను. యూపీ తరఫున నేను ఐదు, ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చేవాడిని. ఈ విషయంలో సురేశ్ రైనా నాకు మార్గదర్శకుడు’’ అని రింకు సింగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.