Virat Kohli: ‘పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే కోహ్లీ చెలరేగి ఆడతాడు’
పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా ప్రమాదకరంగా ఉంటాడని భారత మాజీ వికెట్ కీపర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. నేపాల్తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో పాకిస్థాన్ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టంతా సెప్టెంబరు 2న జరిగే భారత్, పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్పైనే ఉంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరిద్దరూ రాణిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ గురించి భారత మాజీ వికెట్ కీపర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాట్లాడాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కోహ్లీ (82; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) ఆడిన ఇన్నింగ్స్ను అతడు ప్రస్తావించాడు. కోహ్లీకి బౌలింగ్ చేస్తున్నప్పుడు పాకిస్థాన్ బౌలర్లు ఒత్తిడికి గురవుతారని కైఫ్ అభిప్రాయపడ్డాడు. 2022 టీ20 ప్రపంచ కప్లో విరాట్ చెలరేగి ఆడి భారత జట్టును గెలిపించిన క్షణాలు పాక్ బౌలర్లలో మదిలో మెదులుతుంటాయని పేర్కొన్నాడు.
అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్: ప్రజ్ఞానంద
‘‘గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్తో మ్యాచ్ అనగానే అతడు చెలరేగిపోతాడు. పూర్తి బాధ్యత తీసుకుని ఆడతాడు. అతడు ఛేజింగ్ మాస్టర్. టీ20 ప్రపంచకప్లో కోహ్లీ బాగా ఆడటానికి కారణం 2022 ఆసియా కప్. ఆ టోర్నీలో అఫ్గానిస్థాన్పై సెంచరీ బాది తిరిగి ఫామ్ అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ పాకిస్థాన్ బౌలర్ల మదిలో మెదులుతూనే ఉంటుంది. కోహ్లీతో ప్రమాదం పొంచి ఉందని, అతడిని ఔట్ చేస్తే మ్యాచ్ చాలా సులువవుతుందని పాక్ బౌలర్లకు తెలుసు. కానీ, కోహ్లీ ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు. బౌలర్లపైనే ఒత్తిడి ఉంటుంది. పాక్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు, వారి బలాలు, బలహీనతలెంటో కోహ్లీకి తెలుసు. పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ చాలా ప్రమాదకరంగా ఉంటాడు” అని మహమ్మద్ కైఫ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
BCCI: టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ ప్రకటన ఇచ్చింది. వేతనం, అర్హత వివరాలను వెల్లడించింది. -
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో ఈ ఐపీఎస్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు హార్దిక్ నాయకత్వంపై ఆ జట్టు సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. -
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
టీ20 ప్రపంకప్ కోసం టీమ్ఇండియా రోహిత్ సారథ్యంలో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్కు డిప్యూటీగా హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడు. -
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో కీలకమైన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మిణుకుమిణుకుమంటున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. -
ఎవరివో మూడు బెర్తులు?
ఐపీఎల్-17లో కోల్కతా నైట్రైడర్స్కు ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. -
థాయ్లాండ్ టైటిల్పై సాత్విక్ జోడీ గురి
పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి.. థాయ్లాండ్ ఓపెన్ ప్రపంచ సూపర్ 500 బ్యాడ్మింటన్ టైటిల్పై గురిపెట్టారు. -
నార్వే చెస్ టోర్నీకి ప్రజ్ఞానంద, హంపి
భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, కోనేరు హంపి, వైశాలి నార్వే చెస్ టోర్నమెంట్లో పోటీపడనున్నారు. -
నిఖత్, మీనాక్షి, అనామిక శుభారంభం
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (52 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) అనామిక (50 కేజీలు) శుభారంభం చేశారు. -
అదేం పెద్ద గొడవ కాదు
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా మధ్య జరిగింది పెద్ద గొడవేం కాదని ఎల్ఎస్జీ సహాయ కోచ్ లాన్స్ క్లూసెనర్ అన్నాడు. -
వాళ్లు వెళ్లిపోతున్నారు
టీ20 ప్రపంచకప్ ముందు పాకిస్థాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం రావాల్సిందిగా ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్-17లో ఆడుతున్న కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. -
మహిళల షాట్పుట్లో అభా జాతీయ రికార్డు
జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అభా ఖతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. -
కుర్రాళ్లూ.. టెస్టు క్రికెట్ ఆడండి
యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడడంపై దృష్టి సారించాలని.. సుదీర్ఘ ఫార్మాట్లో రాణిస్తేనే అసలైన గౌరవం దక్కుతుందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నాడు. -
మెరిసిన ‘లక్ష్య’ శ్రీనివాస్
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ సత్తా చాటాడు. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్