Kolkata Vs Lucknow: లఖ్నవూతో మ్యాచ్.. కోల్కతాకు తొలి విజయం దక్కేనా?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. వాటిల్లో ఒకటి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా మూడు విజయాలు సాధించి ఊపు మీదున్న ఆ జట్లకు ఓటమి షాక్ తగిలింది. ఇప్పుడు మళ్లీ విజయాల బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఆ రెండు టీమ్లు కోల్కతా-లఖ్నవూ. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
హ్యాట్రిక్ విజయాలు సాధించి దూకుడు మీదున్న కోల్కతాకు చెన్నై అడ్డుగా నిలిచింది. ఇప్పుడు సొంత మైదానంలో లఖ్నవూతో తలపడనుంది. బ్యాటింగ్ పరంగా కోల్కతాకు పెద్ద ఇబ్బందేం లేదు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ శుభారంభం అందిస్తున్నారు. యువ బ్యాటర్ రఘువంశి, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్ దూకుడుగా ఆడుతున్నారు. లఖ్నవూ బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విషయానికొచ్చేసరికి స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్ బౌలింగ్లో రాణించడంతో కోల్కతా విజయాలను నమోదు చేయగలిగింది. స్టార్క్ కూడా ఫామ్లోకి వస్తే కోల్కతాను ఆపడం ప్రత్యర్థులకు కష్టమే.
షమార్ ఆడతాడా?
లఖ్నవూలో నిలకడగా రాణిస్తున్న వారిలో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రమే కనిపిస్తున్నాడు. స్టాయినిస్, పూరన్, డికాక్ అడపాదడపా ఆడి నెట్టుకొస్తున్నారు. గత మ్యాచ్లో వీరందరూ విఫలమైనా యువ బ్యాటర్ ఆయుష్ బదోని హాఫ్ సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చాడు. ఈ సీజన్లో లఖ్నవూ తొలి మ్యాచ్లో ఓడిన తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకుంది. కానీ, దిల్లీతో మాత్రం మళ్లీ ఓటమిని చవిచూసింది. బౌలింగ్ పరంగా మయాంక్ యాదవ్ దూరం కావడం కాస్త నష్టమే. కానీ, అర్షద్ ఖాన్, నవీనుల్ హక్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ ఫర్వాలేదనిపించారు. ఆసీస్పై అదరగొట్టి వార్తల్లో నిలిచిన షమార్ జోసెఫ్ ఈ మ్యాచ్లోనైనా బరిలోకి దిగుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ మధ్యాహ్నం జరగనున్న నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్లో టాస్ నెగ్గే జట్టు బ్యాటింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. మంచు ప్రభావం ఉండదు. ఇరు టీమ్లు ఇప్పటి వరకు మూడుసార్లు తలపడగా.. లఖ్నవూనే విజయం సాధించడం విశేషం. ఆ జట్టుపై తొలి గెలుపు రుచి చూడాలనే లక్ష్యంతోనే కోల్కతా బరిలోకి దిగనుంది.
తుది జట్లు (అంచనా)
కోల్కతా: సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, రఘువంశి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా/వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, రమణ్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
లఖ్నవూ: కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, అర్షద్ ఖాన్, నవీనుల్ హక్ / షమార్ జోసెఫ్, యశ్ ఠాకూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?