Mayank Yadav: ‘మా వాడు మాంసాహారం మానేశాడు.. త్వరలో టీమ్ఇండియాకు ఆడతాడు’
ఐపీఎల్ 17 సీజన్లో లఖ్నవూ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) అదరగొడుతున్నాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడు మున్ముందు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే టీమ్ఇండియాకు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17 సీజన్లో లఖ్నవూ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) అదరగొడుతున్నాడు. బుల్లెట్లాంటి బంతులు విసురుతూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాడు. వేగంతోపాటు వికెట్లు పడగొడుతున్నాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ నిలకడగా గంటకు 150 కి.మీ. కంటే ఎక్కువ స్పీడ్తో బౌలింగ్ చేసి ఆరు వికెట్లు తీశాడు. మయాంక్ తొలి రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 156.7 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్లో మున్ముందు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే టీమ్ఇండియాకు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మయాంక్ యాదవ్ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు త్వరలో టీమ్ఇండియాకు ఆడతాడని విశ్వాసం వ్యక్తంచేశారు.
‘‘వందకు వంద శాతం మయాంక్ త్వరలో టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేస్తాడు. బాగా ఆడతాడు కూడా. ఈ విషయంలో నాకంటే మయాంక్ తండ్రి ఎంతో నమ్మకంగా ఉన్నారు. చాలామంది ఇప్పుడు మయాంక్ పెర్ఫామెన్స్ చూసి అతడు భారత్కు ఆడితే బాగుంటుందని అంటున్నారు. కానీ, రెండేళ్ల కిందటే మా ఆయన ఈ మాట అన్నారు. ఒకవేళ మయాంక్ గాయపడకపోతే వచ్చే టీ20 ప్రపంచకప్ ఆడి ఉండేవాడు అని నా భర్త అంటుంటారు’’ అని మయాంక్ తల్లి మమత యాదవ్ పేర్కొన్నారు.
అందుకే నాన్ వెజ్ మానేశాడు
మయాంక్ డైట్ ప్లాన్ గురించి ఆమె వివరించారు. ‘గతంలో మాంసాహారం తినేవాడు. ఇప్పుడు పూర్తి శాఖాహారుడిగా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్టేరియన్ ఫుడ్ మాత్రమే తింటున్నాడు. తన డైట్ చార్ట్కు అనుగుణంగా ఏది కావాలని కోరితే అది తయారుచేసి ఇస్తాం. మరీ ప్రత్యేకంగా ఏమీ తినడు. పప్పు, రోటీ, అన్నం, పాలు, కూరగాయలు వంటివి తింటాడు. మయాంక్ నాన్ వెజ్ మానేయడానికి రెండు కారణాలు చెప్పాడు. ఒకటి.. తను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టానన్నాడు. రెండు.. మాంసాహారం తన శరీరానికి పడటం లేదని చెప్పాడు’’ అని మయాంక్ తల్లి వివరించారు.
‘‘మయాంక్ భారత్ తరఫున అరంగేట్రం చేస్తాడని వంద శాతం నమ్ముతున్నా. అతనికి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తను క్రికెటర్ అవుతాడని ఫిక్సయ్యా. ఆ లక్ష్యం వెనక నేను ఉన్నాను. 14 ఏళ్ల వయసులో ట్రయల్కు వెళ్లినప్పుడు అతను అందరికంటే ముందున్నాడు. మయాంక్ ఎప్పుడూ నా సూచనలను ధిక్కరించలేదు. 16 ఏళ్లు వచ్చేసరికి అతను మరింత శక్తిని కలిగిఉండటమే కాక మరింత పరిణితి చెందాడు’’ అని మయాంక్ తండ్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?