Gujarat vs Punjab: ఉత్కంఠ పోరు.. గుజరాత్పై పంజాబ్ విజయం
ఐపీఎల్-17లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 17 సీజన్లో పంజాబ్ మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ (61*; 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), ఆశుతోష్ శర్మ (31; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ప్రభ్సిమ్రన్ సింగ్ (35; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. బెయిర్స్టో (22), జితేశ్ శర్మ (16), సికిందర్ రజా (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. శిఖర్ ధావన్ (1), సామ్కరన్ (5) సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే ఒక్కో వికెట్ తీశారు. శశాంక్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
శశాంక్, ఆశుతోష్ మెరుపులు
70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్ను శశాంక్ ఆదుకున్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 11 ఓవర్లో వరుసగా 4,6,4 బాదేసి జోరందుకున్నాడు. సికిందర్, జితేశ్ ఔటైనా ఆశుతోష్ శర్మతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమైన దశలో ఒమర్జాయ్ వేసిన 18 ఓవర్లో ఆశుతోష్ మూడు ఫోర్లు బాదేశాడు. మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్లో శశాంక్, ఆశుతోష్ చెరో సిక్స్ బాదారు. ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు రావడంతో పంజాబ్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్ (బౌలర్ దర్శన్ నల్కండే)లో ఏడు పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి ఆశుతోష్.. రషీద్ ఖాన్కు చిక్కాడు. శశాంక్ మిగతా పని పూర్తి చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్మన్ గిల్ (89*; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) దంచికొట్టాడు. సాయి సుదర్శన్ (33; 19 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. కేన్ విలియమ్సన్ (26; 22 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రాహుల్ తెవాటియా (23; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో మెరుపులు మెరిపించాడు. వృద్ధిమాన్ సాహా (11), విజయ్ శంకర్ (8) నిరాశపర్చారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?