Tamim - RR: తమీమ్ ‘యూ టర్న్’పై రాజస్థాన్ రాయల్స్ ఆసక్తికర ట్వీట్!
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు క్రికెట్లో చోటు చేసుకున్న వేగవంతమైన సంఘటనలను రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ట్వీట్ రూపంలో తెలిపింది. అయితే, అందులో తమీమ్ ఇక్బాల్ నిర్ణయం కూడా ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఒక్క రోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్పై (Tamim Iqval) నెట్టింట ట్రోలింగ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఒత్తిడితో తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తమీమ్ ప్రకటించాడు. దీంతో తమీమ్ ‘యూ టర్న్’పై రాజస్థాన్ రాయల్స్ సరదాగా స్పందించింది. ఈ ఏడాది అత్యంత వేగంగా చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. అందులో ఎంఎస్ ధోనీ స్టంపింగ్, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ, మార్క్వుడ్ వేగవంతమైన బంతి, తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ నిర్ణయం.. అంటూ నాలుగు ఫొటోలను జత చేసింది.
- ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోనీ అత్యంత వేగంగా శుభ్మన్ గిల్ను స్టంపౌట్ చేశాడు. కేవలం 0.1 సెకన్ల వ్యవధిలోనే చేయడం విశేషం.
- ఇదే ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. కోల్కతా నైట్రైడర్స్పై వీరవిహారం చేశాడు.
- ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో మార్క్ వుడ్ ఏకంగా 96.5 మైళ్ల వేగంతో (155 కి.మీ) బంతిని సంధించాడు. ఈ ఏడాది క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక వేగవంతమైన బంతి ఇదే.
- ఇప్పుడు తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్లు అఫ్గానిస్థాన్తో మ్యాచ్ అనంతరం ప్రకటించాడు. కొత్త కెప్టెన్ను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించాడు. తీరా 24 గంటలు ముగియకముందే తన రిటైర్మెంట్ను తమీమ్ వెనక్కి తీసుకోవడం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోని మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..