ధోనీతో ‘స్పైడర్ పంత్’: 40లక్షల ఫాలోవర్స్
ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. తమ బిజీబిజీ షెడ్యూల్లో దొరికిక ఈ కాస్త విరామాన్ని....
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. తమ బిజీబిజీ షెడ్యూల్లో దొరికిక ఈ కాస్త విరామాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ మాజీ సారథి ఎంఎస్ ధోనీతో కలిసి సందడి చేశాడు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ధోనీ సతీమణి సాక్షి తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ఫొటోలో సన్నిహితులతో ధోనీ, సాక్షి వీడియో కాల్లో మాట్లాడుతుండగా పంత్ చిరునవ్వుతో వాళ్లని పలకరిస్తున్నాడు.
కాగా, పంత్ తన ఇన్స్టాగ్రామ్లో 40 లక్షల ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తనకి మద్దతిస్తున్న అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పంత్ వివిధ జెర్సీలు ధరించిన ఫొటోలు ఉన్నాయి. టీమిండియా టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్ జెర్సీలు, దిల్లీ క్యాపిటల్స్ జెర్సీలతో పాటు స్పైడర్ మ్యాన్ జెర్సీ ఉండటం గమనార్హం.
గబ్బా టెస్టులో పంత్ హిందీ వెర్షన్లో స్పైడర్ మ్యాన్ పాటను పాడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అప్పటినుంచి పంత్ను ‘స్పైడర్ పంత్’గా నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. గబ్బా టెస్టు విజయానంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం పంత్ను స్పైడర్ మ్యాన్ అంటూ కొనియాడటం గమనార్హం. దీంతో పంత్ ఇలా.. ‘స్పైడర్ పంత్’గా మారిపోయాడు.
ఇదీ చదవండి
దాదా కాల్ చేశాడు.. క్రెడిట్ ద్రవిడ్కే: రహానె
అంచనాలు వద్దు.. ఒత్తిడి పెంచొద్దు: గంభీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?