Virat - Rohit: ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ - రోహిత్ జోడీ
శ్రీలంకతో మ్యాచ్లో (IND vs SL) స్వల్ప వ్యవధిలో భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔటైనప్పటికీ.. ఓ ప్రపంచ రికార్డును మాత్రం తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ సూపర్ -4లో (Asia Cup 2023) భాగంగా శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తలపడుతోంది. అయితే, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులను జోడించిన బ్యాటర్లుగా నిలిచారు. ఇంతకుముందు వరకు వెస్టిండీస్ దిగ్గజ ద్వయం గార్డన్ గ్రీనిడ్జ్ - డెస్మాండ్ హేన్స్ పేరిట ఈ రికార్డు ఉండేది. వారిద్దరూ 97 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ను తాకారు.
ఇప్పుడు విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ (Rohit Sharma - Virat Kohli) కేవలం 86 ఇన్నింగ్స్ల్లోనే ఐదు వేల పరుగుల భాగస్వామ్యం నిర్మించడం విశేషం. ఇందులో 18 సార్లు సెంచరీ భాగస్వామ్యం, 15 సార్లు హాఫ్ సెంచరీల పార్టనర్షిప్ ఉంది. దాదాపు 62.47 సగటుతో పరుగులు చేశారు. అత్యధికంగా 2018లో ఆసీస్పై 246 పరుగులను జోడించారు. అయితే, ఇప్పుడు శ్రీలంకపై కేవలం 10 పరుగులు మాత్రమే జోడించారు. కోహ్లీ కేవలం 3 పరుగులకే ఔట్ కాగా.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ సాధించి పెవిలియన్కు చేరాడు. అంతేకాకుండా ఆసియా కప్లోనూ ఐదు వందల పరుగుల భాగస్వామ్యం కూడా దాటేశారు.
పదివేల క్లబ్లో రోహిత్
ఆసియా కప్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ ఓ మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. అయితే, విరాట్ తర్వాత అత్యంత వేగంగా పది వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్ రోహిత్ కావడం విశేషం. కోహ్లీ 205 ఇన్నింగ్స్లో చేయగా.. రోహిత్ 241 ఇన్నింగ్స్ల్లో పది వేల మార్క్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ తెందూల్కర్ (259 ఇన్నింగ్స్లు), గంగూలీ (263), రికీ పాంటింగ్ను అధిగమించాడు. భారత్ నుంచి పది వేల క్లబ్లోకి చేరిన ఆరో ఆటగాడిగా.. అంతర్జాతీయంగా 15వ బ్యాటర్ కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.