Rohit: ఒక్కరిపైనే ఆధారపడం.. హార్దిక్ ఫిట్గా ఉన్నా విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తాం: రోహిత్
వన్డే ప్రపంచకప్లో భారత్ ఏడో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్కప్లో (ODI World Cup 2023) జట్టు కాంబినేషన్లకు సంబంధించి తమ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెల్లడించాడు. ఒకవేళ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఫిట్నెస్ సాధించి వచ్చినా.. విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించడం మాత్రం ఆపబోమని తెలిపాడు. ప్రతి ఆటగాడూ సంసిద్ధంగా ఉన్నాడని.. ఎప్పుడు అవకాశం వచ్చినా వారు తమ సత్తా నిరూపించుకొంటారని పేర్కొన్నాడు. ముంబయి వేదికగా శ్రీలంకతో భారత్ (IND vs SL) తలపడనుంది. హార్దిక్ పాండ్య లీగ్ దశలోని మ్యాచ్లకూ దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. ఒకరిపైనే అతిగా ఆధారపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించాడు.
‘‘క్రికెట్లో ప్రతి కాంబినేషన్ కీలకమే. ఆచరణ సాధ్యమే. ఇప్పటికీ అవసరమైతే మేం ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడగలం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలిచారు. హార్దిక్ వంటి పేస్ ఆల్రౌండర్ అందుబాటులో ఉన్నా..? లేకున్నా..? మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడిస్తాం. కావాలనుకుంటే ముగ్గురు పేసర్లను బరిలోకి దింపుతాం. అయితే, ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యమే. మా పేసర్లందరూ అద్భుతమైన లయ అందుకొన్నారు. విశ్రాంతి అవసరం లేదని వారే భావిస్తున్నారు. ఇప్పటికే బౌలర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. మ్యాచ్లను ఆడేందుకు వారు ఉత్సాహంగా ఉన్నారు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.